Don't Miss!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రిటైర్డ్ మేజర్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్...!
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రిటైర్డ్ మేజర్ గా నటిస్తూ ఓ నూతన చిత్రం రూపుదిద్దుకొంటుంది. వివరాలప్రకారం రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా కైపస్ ఫిలింస్ ప్రొడక్షన్స్ హౌస్ సంస్థ భవాని శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాదు పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకొంటోంది.
ఈ చిత్ర విశేషాలను డా.రాజేంద్ర ప్రసాద్ తెలుపుతూ ఒక పెద్ద బంగాళా యజమాని మాజీ ఆర్మీ అధికారి .ఆ అధికారి అధికారంలో ఉన్నన్నిరోజులూ క్షణం తీరిక లేకుండా కష్టపడ్డాడు.ఆయనకు ఒక కుమారుడు. ఆ కుమారుడు అమెరికాలో వుంటాడు.ఆర్మీ ఉద్యోగ విరమణ అనంతరం కాలంగడవడమే కష్టమైపోతుంది. ఎదో తెలియని ఒంటరి తనం వారిని వేధిస్తుంది.ఆ ఒంటరి తనాన్ని భరించలేక ఆ రిటైర్డ్ మేజర్ ఏమిచేసాడో తెరపై చూసి తెలుసుకోవలసిందే అంటూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఈ చిత్రంలో మేజర్ పాత్రలో తాను నటించానని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మంగళవారం నాటికి ఆయనకు యాభై ఐదేళ్లు నిండుతాయని, ఈ సమయంలో నటుడిగా నిరూపించుకొనే పాత్రలు రావడం నిజంగా సంతొషంగా వుందని తెలిపారు. ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా అంతర్జాతియ విలువలున్న చిత్రంగా నిలుస్తుందని తన నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఈ చిత్రంతో పాటూ రాజేంద్రప్రసాద్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'మొగుడు' లో, అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలొ రూపుదిద్దుకొంటున్న'నారాయణ రావు మేస్టారు' అనే పాత్రలోనూ నటిస్తున్నారు.