twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిటైర్డ్ మేజర్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్...!

    By Sindhu
    |

    నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రిటైర్డ్ మేజర్ గా నటిస్తూ ఓ నూతన చిత్రం రూపుదిద్దుకొంటుంది. వివరాలప్రకారం రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా కైపస్ ఫిలింస్ ప్రొడక్షన్స్ హౌస్ సంస్థ భవాని శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాదు పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకొంటోంది.

    ఈ చిత్ర విశేషాలను డా.రాజేంద్ర ప్రసాద్ తెలుపుతూ ఒక పెద్ద బంగాళా యజమాని మాజీ ఆర్మీ అధికారి .ఆ అధికారి అధికారంలో ఉన్నన్నిరోజులూ క్షణం తీరిక లేకుండా కష్టపడ్డాడు.ఆయనకు ఒక కుమారుడు. ఆ కుమారుడు అమెరికాలో వుంటాడు.ఆర్మీ ఉద్యోగ విరమణ అనంతరం కాలంగడవడమే కష్టమైపోతుంది. ఎదో తెలియని ఒంటరి తనం వారిని వేధిస్తుంది.ఆ ఒంటరి తనాన్ని భరించలేక ఆ రిటైర్డ్ మేజర్ ఏమిచేసాడో తెరపై చూసి తెలుసుకోవలసిందే అంటూ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

    ఈ చిత్రంలో మేజర్ పాత్రలో తాను నటించానని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ మంగళవారం నాటికి ఆయనకు యాభై ఐదేళ్లు నిండుతాయని, ఈ సమయంలో నటుడిగా నిరూపించుకొనే పాత్రలు రావడం నిజంగా సంతొషంగా వుందని తెలిపారు. ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా అంతర్జాతియ విలువలున్న చిత్రంగా నిలుస్తుందని తన నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఈ చిత్రంతో పాటూ రాజేంద్రప్రసాద్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'మొగుడు' లో, అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలొ రూపుదిద్దుకొంటున్న'నారాయణ రావు మేస్టారు' అనే పాత్రలోనూ నటిస్తున్నారు.

    English summary
    Krishna Vamsi’s upcoming movie Mogudu with Gopichand has resumed its shooting part in hyderabad. Dr.Rajendra Prasad will be acting as Gopichand father in the movie and Tapsi will be playing the lead role with Gopi Chand in Mogudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X