Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ చిత్రంలో శ్రీకృష్ణుడిగా రాజేంద్రప్రసాద్
క్విక్ గన్ మురగన్ కనిపించి అలరించిన రాజేంద్రప్రసాద్ త్వరలో శ్రీకృష్ణుడుగా కనిపించి రంజింపచేయబోతున్నాడు. శివాజీ, అర్చన జంటగా చేగొండి హరిబాబు నిర్మిస్తున్న 'ఏమైంది నాలో' చిత్రంలో ఈ పాత్ర కనపడనుంది. ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. రచయిత రాజేంద్రకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ.."అదొక అందమైన కాలేజీ. ఎందుకంటే అక్కడ చాలా అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు కాబట్టి. ఈ కాలేజీ ఆవరణలో అకస్మాత్తుగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు అంటే... ఇక్కడ ఏ లెక్చరరో, స్టూడెంటో అనుకునేరు. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే. భగవంతుడికి కాలేజీలో పని ఏంటనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్. ఆ వింతలూ విడ్డూరాలు తెలుసుకోవాలంటే 'ఏమైంది నాలో' చిత్రం చూడాల్సిందే' అంటున్నారు.
అలాగే సమర్పకురాలు చేగొండి భారతి తెలియజేస్తూ "కాలేజీ నేపథ్యంలో జరిగే ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీలో శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడనేది ఆసక్తికరం. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ల మీద చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్. ఇప్పటికే ఈ సినిమా పాటలు సూపర్ హిట్టయ్యాయి. ప్రేమకథల్లో ఓ కొత్తకోణాన్ని చూపించే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ముఖ్యంగా యువతనిబాగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. నవంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, సినిమాటోగ్రఫీ: జయరామ్