Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాజేంద్రప్రసాద్ కొత్త కామెడీ చిత్రం విడుదల ఎప్పుడంటే...
రాజేంద్రప్రసాద్, సుహాసిని ప్రధాన పాత్రధారులుగా ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై దినేష్బాబు దర్శకత్వంలో జొన్నాడ రమణమూర్తి నిర్మిస్తున్న చిత్రం "భలే మొగుడు భలే పెళ్లాం". ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. నిర్మాత జొన్నాడ రమణమూర్తి మాట్లాడుతూ- కుటుంబ కథ, హాస్య చిత్రంగా దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్, సుహాసినిల హాస్యం సరికొత్తగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇన్కంటాక్స్ ఆఫీసర్గా హీరో, ఆయన భార్య బ్యాంక్ ఉద్యోగిగా ఉంటే వారిమధ్య సమస్యలు ఎలా ఉంటాయి అనే సున్నితమైన హాస్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాము అన్నారు. ఇక దర్శకుడు దినేష్ బాబు...తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 32 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. రఘుబాబు, సూర్యతేజ్, హర్షవర్ధన్, ఝాన్సీ, రజిత, రమ్యశ్రీ, శిల్ప, ఉషశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్, సంగీతం: ఇ.ఎస్.మూర్తి, ఎడిటింగ్: మురళీ రామయ్య, నిర్మాత: జొన్నాడ రమణమూర్తి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దినేష్ బాబు.