Don't Miss!
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజేంద్రప్రసాద్ కొత్త కామెడీ చిత్రం విడుదల ఎప్పుడంటే...
రాజేంద్రప్రసాద్, సుహాసిని ప్రధాన పాత్రధారులుగా ఉషాచరణ్ క్రియేషన్స్ పతాకంపై దినేష్బాబు దర్శకత్వంలో జొన్నాడ రమణమూర్తి నిర్మిస్తున్న చిత్రం "భలే మొగుడు భలే పెళ్లాం". ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. నిర్మాత జొన్నాడ రమణమూర్తి మాట్లాడుతూ- కుటుంబ కథ, హాస్య చిత్రంగా దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజేంద్రప్రసాద్, సుహాసినిల హాస్యం సరికొత్తగా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇన్కంటాక్స్ ఆఫీసర్గా హీరో, ఆయన భార్య బ్యాంక్ ఉద్యోగిగా ఉంటే వారిమధ్య సమస్యలు ఎలా ఉంటాయి అనే సున్నితమైన హాస్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాము అన్నారు. ఇక దర్శకుడు దినేష్ బాబు...తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 32 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా వందకు పైగా చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసారు. రఘుబాబు, సూర్యతేజ్, హర్షవర్ధన్, ఝాన్సీ, రజిత, రమ్యశ్రీ, శిల్ప, ఉషశ్రీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: గంగోత్రి విశ్వనాథ్, సంగీతం: ఇ.ఎస్.మూర్తి, ఎడిటింగ్: మురళీ రామయ్య, నిర్మాత: జొన్నాడ రమణమూర్తి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: దినేష్ బాబు.