Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాజేంద్ర ప్రసాద్ శపథం.. అదే జరిగితే ఇక మీ ముందుకు రానంటూ!
నటుడు రాజేంద్ర ప్రసాద్ పూర్తి స్థాయిలో అలరించే పాత్రతో వచ్చిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఏమీ లేవు. ఆయన పూర్తిస్థాయిలో నటిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. ఎఫ్ 2 అనే సినిమాకు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సినిమా రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.. ఆయన ఈ సినిమా కనుక ఆడకపోతే తాను మళ్లీ సినిమాల్లో కనిపించని అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
ప్రీ రిలీజ్
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన తాజాగా చిత్రం 'ఎఫ్3'. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది.
ఎఫ్3లో కూడా కీలక పాత్ర
ఇక ఈ వేదికపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్2 సినిమాలో కీ రోల్ ప్లే చేసిన నటుడు రాజేంద్రప్రసాద్.. ఎఫ్3లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజానికి ఎఫ్3 మూవీ ఎంతో అవసరం అని పేర్కొన్నారు. ప్రతి మనిషికి నవ్వు అవసరం అని.. ఆ నవ్వులు పంచే సినిమా ఎఫ్3 అని ఆయన చెప్పుకొచ్చారు.
మీ ముందు నిలబడను
అందరి జీవితాల్లో సమస్యలు ఉంటాయని.. వాటి అన్నింటికి పరిష్కారం నవ్వు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాను 40 ఏళ్లుగా నవ్వును నమ్ముకుని ఉన్నానని చెప్పారు. అంతే కాక ఈ ఎఫ్3ను డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను అద్భుతంగా తీశారని రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ ఒక శపథం చేశారు. ఈ సినిమా హిట్ కాకపోతే.. గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్నా.. మళ్లీ మీ ముందు నేను ఎప్పుడు నిలబడనని అన్నారు..
ఆయన తర్వాత దిల్ రాజు
మనిషికి ఏం అవసరమో అదేవిధంగా సినిమా తీశారని, ఈ సినిమాలో అన్ని పాత్రలు 100 శాతం ప్రేక్షకులను నవ్విస్తాయని ఆయన అన్నాడు. ఎఫ్3 సినిమా ప్రతి ఒక్కరు చూసి.. సూపర్ హిట్ చేయాలని కోరారు. ఇక ఒకప్పుడు తెలుగు సినిమా మూవీ మొఘల్ మా డాడీ రామానాయుడు గారు ఉండేవారు.. వారి తరువాత మనస్ఫూర్తిగా నేను మూవీ మొఘల్ అని పిలవగలిగేది నా సోదరుడు దిల్ రాజునే అని అన్నాడు.
అత్యవసరమైన సినిమా
ఈ సినిమా నిర్మాత శిరీష్ ఒక మంచి మనిషి.. నాకు నిండుగా నచ్చినటువంటి మనిషని అన్నారు. ఈ రోజు మనం ఉన్న పరిస్థితికి 100% అవసరమైన సినిమా ఎఫ్3 అని, సమాజంలో బయట టెంపరేచర్ వేడి, సమస్యల వేడితో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చాలా అత్యవసరమైనటువంటి నవ్వులను పంచే సినిమా ఇది అని అన్నారు. మొత్తం మీద ఆయన చేసిన ఆసక్తి కరమైన శపథం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.