రాజేంద్రప్రసాద్... పైకిరాడు రానివ్వడా?

By Bojja Kumar

హైదరాబాద్: రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలో రూపొందుతున్న చిత్రం 'నూతిలో కప్పలు'. పైకి రావు, రానివ్వవు అనేది ఈ చిత్రం క్యాప్షన్. పోల్‌స్టార్ పిక్చర్స్ పతాకంపై చంటి జ్ఞానమణి దర్శకత్వంలో వినయ్, పూనాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 70 శాతం పూర్తియింది.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ సరికొత్త గెటప్‌తో ఈ చిత్రంలో కనిపిస్తాడని, ఆయన పాత్రే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, పూర్తి కమర్షియల్ విలువలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా చిత్రం రూపొందుతుందని తెలిపారు. మిగిలిన షూటింగ్‌ను చివరి షెడ్యూల్‌లో ఈ నెలలోనే చిత్రీకరిస్తామని తెలిపారు.

భరత్‌భూషణ్, రామ్‌తేజ్, విజయ్, మనోజ్ నందం, పరీసింగ్, దీక్షాపంత్, రాధాకుట్టి, తాగుబోతు రమేష్, అల్లరి సుభాషిణి, మేల్కొటె తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహన్‌రెడ్డి, ఎడిటింగ్: రామ్స్, నిర్మాతలు: వినయ్, పూనాటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంటి జ్ఞానమణి.

రాజేంద్ర ప్రసాద్ నటించిన 'ఓనమాలు' చిత్రం ఇటీవల విడుదలైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గతంలో ఆయన నటించిన ఆనలుగురు, మీశ్రేయోభిలాషి లాంటి మంచి చిత్రాల సరసన ఓ మంచి జ్ఞాపకం లాంటి సినిమాగా 'ఓమమాలు' చిత్రం చోటు సంపాదించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X