Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రుణం తీర్చుకునేందుకే నటించా: రాజేంద్ర ప్రసాద్
హైదరాబాద్: తాను తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకునేందుకే ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు వంటి చిత్రాలలో నటించానని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో పాడవోయి భారతీయుడా పేరిట సచివాలయ ఉద్యోగులకు పాటల పోటీని నిర్వహించింది.
విజేతల కోసం బుధవారం అభినందన సంభ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరణించిన తరువాత కూడా జనం గుండెల్లో నిలచిన వాడే మనీషి అని రాజేంద్రప్రసాద్ అన్నారు. భూమ్మీద నుంచి మనం వెంట తీసుకెళ్లేది ఏదీ లేదు.. సాధించేది ఏదీ లేదు.. ఒక్క మంచీ.. చెడు తప్పఅన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ పద్యాన్ని పాడి అందరినీ అలరించారు.
కాగా యువతలో మార్పు తీసుకువచ్చే సందేశాత్మకమైన చిత్రం ఓనమాలు అని.. ఇలాంటి మంచి చిత్రాలను అందరూ ఆదరించి, ప్రోత్సహించాలని, జాలిపడి ఈ సినిమా చూడవద్దని రాజేంద్ర ప్రసాద్ మూడు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. తన తండ్రి ఆశీర్వాదంతోనే ఈ చిత్రంలో నారాయణ మాస్టారుగా మీ ముందుకు వచ్చానని చెప్పారు.