Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దిల్ రాజు ముందే... పూనమ్ కౌర్కు వార్నింగ్ ఇచ్చినా రాజేంద్ర ప్రసాద్!
Recommended Video
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇటీవల జరిగిన మూవీ ఆడియో వేడుకలో రాజేంద్రప్రసాద్ ఎమోషనల్గా మాట్లాడారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే ఒక అద్భుతమైన సినిమా అని వ్యాఖ్యానించారు. అయితే తాను మాట్లాడుతుంటే హీరోయిన్ పూనమ్ నవ్వడంతో ఆయన కాస్త సీరియస్ అయ్యారు.
ఎన్నో విలువైన విషయాలు
ఈ సినిమాలో పెళ్లి గురించి ఎన్నో కొత్త విషయాలు చెప్పారు. యాక్ట్ చేస్తున్న మాకే పెళ్లిలో ఇన్ని విషయాలు ఉన్నాయా? అని ఆశ్యర్యపోయాం. ఈ అంశం భలే థ్రిల్లింగా ఉంది, పెళ్లి గురించి ఇది తెలిస్తే బావుండునే... ఇది తెలిస్తే పెళ్లి యొక్క వాల్యూ పెరుగుతుందే... మన జీవితంలో మనకు ఎన్నో వాల్యుబుల్ విషయాలు తెలిస్తాయే.. అని నేను ఫీలయ్యాను... అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఎగతాలిగా నవ్విన పూనమ్
ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత మా ఆవిడను వెంట పెట్టుకుని తీసుకొచ్చాను అని రాజేంద్ర ప్రసాద్ అనగానే పూనమ్ ఎగతాలిగానవ్వడంతో.. ‘ఓయ్ పూనమ్ యూవర్ టూ యంగ్ టు ఫీల్ లైక్ దట్, నేను నిజాయితీగా చెబుతున్నాను, నువ్వు అలా నవ్వడం సరికాదు'.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.
మళ్లీ మళ్లీ చూస్తారు
నేనెప్పుడూ మా ఆవిడతో రాలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది జరుగడానికి కారణం నాకు ఈ సినిమా ద్వారా ఆఫీల్ కలుగడమే.యాక్ట్ చేసిన నేనే మా ఆవిడను తీసుకుని వస్తే... రేపు సినిమా చూసిన మీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సార్లైనా చూస్తారని, చూసిన ఈ సంస్కారవంతమైన కమర్షియల్ సినిమాను చూస్తారని నా నమ్మకం... అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
దిల్ రాజు ఈ స్థాయికి ఎదగడానికి కారణం
దిల్ రాజుగారు తీస్తే ఏ సినిమా అయినా కమర్షియల్ అయిపోతుంది. మా డాడీ, సినీ మొగల్ రామానాయుడు గారి తర్వాత దిల్ రాజు ఆ స్థాయికి రావడానికా కారణం అతడి స్వాస సినిమా, అతడి ఆలోచన సినమా... 24 గంగలు సినిమా గురించే ఆలోచిస్తాడు. అలా ఉంటేనే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లు అవుతారు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.