Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాజశేఖర్ విలన్ గా ఎంట్రి, హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా?
ప్రవీణ్ సత్తార్ తాజాగా ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్ హీరోగా సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ఒక సీనియర్ హీరో విలన్ గా నటిస్తున్నాడు.
రామ్ తో హిట్ డైరెక్టర్
సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన పీయస్వీ గరుడవేగ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తాజాగా ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్ హీరోగా సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
స్రవంతి మూవీస్
మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలోని కొన్ని ప్రదేశాలో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది.
రామ్ పక్కన మాళవిక
రామ్ సరసన మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ రవితేజ సరసన నేల టికెట్ సినిమాలో నటిస్తోంది. ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ హీరోయిన్. రామ్ సినిమాలో తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకె చెప్పేసిందట ఈ హీరోయిన్.
రాజశేఖర్ విలన్ గా
ఈ సినిమాలో రాజశేఖర్ విలన్గా నటిస్తున్నారట. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు అడగడంతో రాజశేఖర్ వెంటనే ఒప్పుకోవడం జరిగిందని సమాచారం. గతంలో కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు అవకాశాలు వచ్చినా రాజశేఖర్ చెయ్యలేదు. కాని ఈ సినిమా చెయ్యడం విశేషం.