Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రేకింగ్: పొలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రజినీకాంత్ సంచలన ప్రకటన
వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్.. రాజకీయాల్లో ప్రవేశించబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆయన ఈ మధ్య తన అభిమాన సంఘం 'రజినీ మక్కల్ మండ్రుం' సభ్యులతో తరచూ కలుస్తున్నారు. గత నెల 30న విస్తృత స్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రేపోమాపో ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రకటన ఉండొచ్చు అని ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్ రజినీకాంత్.
ஜனவரியில் கட்சித் துவக்கம்,
டிசம்பர் 31ல் தேதி அறிவிப்பு. #மாத்துவோம்_எல்லாத்தையும்_மாத்துவோம்#இப்போ_இல்லேன்னா_எப்பவும்_இல்ல 🤘🏻 pic.twitter.com/9tqdnIJEml— Rajinikanth (@rajinikanth) December 3, 2020
తమిళ ప్రజలు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నో ఊహాగానాలు.. మరెన్నో సందేహాల నడుమ రజినీకాంత్ నుంచి సంచలన ప్రకటన వచ్చేసింది. యాభై ఏళ్లుగా సినీ రంగంలో తనదైన ముద్రను వేసుకుని, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్.. తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్లో 'జనవరిలో పార్టీ ప్రారంభం.. డిసెంబర్ 31న ప్రకటించబోతున్నాం' అని ఓ పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
వాస్తవానికి రజినీకాంత్ భారతీయ జనతా పార్టీతో కలిసి నడుస్తారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే, దీన్ని ఆయన అభిమానులు వ్యతిరేకించారు. అంతేకాదు, సొంతం పార్టీని పెట్టాలన్న ప్రతిపాదనను సైతం సూపర్ స్టార్ ముందు ఉంచారు. అందుకు అనుగుణంగానే ఈ మధ్య తలైవాతో సమావేశం అవుతూ పార్టీకి సంబంధించిన విధి విధానాల గురించి చర్చలు జరిపారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం రజినీకాంత్... మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు. వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న ఆయన.. ఈ మూవీతోనైనా భారీ హిట్ను అందుకోవాలని భావిస్తున్నారు. అందుకోసమే ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక, ఇటీవలే కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న ఆయన.. కరోనా వైరస్ ప్రభావం కారణంగా సినిమా షూటింగ్లకు హాజరు కావడం లేదు.