Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టాలీవుడ్ బుడ్డా రీమేక్ కి పూరి ప్లాన్...!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కి విజయవంతమైన హిందీ చిత్రం 'బుడ్డా హోగా తేరా బాప్". ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అమితాబ్ బాడీ లాంగ్వేజ్ కు, వయసుకు సరిపడినట్లు స్క్రిప్టును సిద్ధం చేసుకుని బాలీవుడ్ ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్న పూరీ జగన్నాథ్ ఇపుడు రజినీకాంత్ హీరోగా ఈ చిత్రాన్ని తమళంలో చేయాలనుకుంటున్నట్లు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి.
'రానా" పూజాకార్యక్రమాలు నిర్వహించిన రోజే రజనీకాంత్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత రజనీ చికిత్స కోసం సింగపూర్ వెళ్లడంతో తాత్కాలికంగా ఆగిపోయిన 'రానా" షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని రజనీ అభిమానులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. చికిత్స ముగించు కొని సింగపూర్ లో గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్న రజనీకాంత్ ఈ నెల 13న చ్నై తిరిగి వచ్చారు.
అయితే అర్థాంతరంగా ఆగిపోయిన 'రానా" షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం అవుతుందని, అంత వరకు కెళంబాక్కమ్ ఫామ్ హౌస్ లో రజనీ విశ్రాంతి తీసుకుంటారని రజనీకి అత్యంత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం పూర్తయ్యాక బుడ్డా చిత్రాన్ని రజినీతో చేయాలని పూరీ అనుకుంటున్నట్లు భోగట్టా. రజినీ ఓకే అంటే ఇక టాలీవుడ్ బుడ్డా తెరకెక్కడమే తరువాయి.