Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రజనీ ఫ్యాన్స్ కంగారు పడొద్దు, '2.0' రిలీజ్ మీద నిర్మాత ప్రకటన
సూపర్స్టార్ రజనీకాంత్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న '2.0' చిత్రం విడుదలపై నెలకొన్న అయోమయానికి నిర్మాతలు తెరదించారు. ఇప్పటికే సినిమా ఓసారి వాయిదా పడటంతో ఆందోళనలో పడ్డ అభిమానులకు ఊరటనిచ్చే వార్త చెప్పారు నిర్మాతలు.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోందని, ఈ చిత్రాన్ని 2018 ఏప్రిల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం తెలియజేశారు.
ఏదీన విడుదలయ్యే అవకాశం ఉంది?
ఈ చిత్రాన్ని తమిళ న్యూఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 13, 2018వ తేదీకి కాస్త అటు ఇటుగా విడుదల చేసే అవకాశం ఉంది.
450 కోట్ల బడ్జుట్, మూడేళ్ల కష్టం
2.0 సినిమా కోసం దర్శకుడు శంకర్ దాదాపు మూడేళ్లుగా కష్టపడుతున్నారు. 2015 జనవరి లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' మూవీ విడుదల తర్వాత తన పూర్తి సమయాన్ని ‘2.0' సినిమా కోసమే కేటాయించారు. సినిమాలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంతో కేర్తో టేకప్ చేస్తూ వచ్చారు. 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో హాలీవుడ్ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
కీలక పాత్రలు
సూపర్స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్ విలన్గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్ హుసేన్, కళాభవన్ షాజాన్, రియాజ్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఆలస్యం అందుకే...
‘2.0' మూవీ ఇండియాలోనే హై బడ్జెట్ మూవీ. దాదాపు రూ. 450 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాలో తప్పులు వెతికి అవహేళన చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇంత ఖర్చు పెట్టి అలాంటి మాటలు పడటం ఎందుకు? అనే ఉద్దేశ్యంతోనే సినిమా విడుదల కాస్త ఆలస్యమైనా మంచిదే.... పర్ఫెక్ట్ మూవీ ప్రేక్షకులకు చూపించాలనేది ఉద్దేశ్యంలో శంకర్ ఉన్నారు. అందుకే పోస్టు ప్రొడక్షన్లో గ్రాఫిక్స్ పరంగా చాలా కరెక్షన్స్ చేస్తున్నారు.
అక్షయ్ ద్వారా బాలీవుడ్లో భారీగా మార్కెటింగ్
అక్షయ్ ద్వారా బాలీవుడ్లో భారీగా మార్కెటింగ్ ‘2.0' మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ద్వారా ఈ సినిమాకు ఉత్తరాదిన భారీ కలెక్షన్స్ రాబట్టాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ సినిమా బాహుబలి రికార్డులతో పాటు ఇతర బాలీవుడ్ సినిమాల రికార్డులను ఏ మేరకు బద్దలు కొడుతుందో చూడాలి.