Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఇక ...రజనీకాంత్ స్జేజీ నాటకాలు
హైదరాబాద్: ఇప్పటి వరకు వెండితెరపై అభిమానులకు వినోదాన్ని పంచిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో స్టేజ్ నాటకంలో నటించబోతున్నారు. ప్రముఖ తమిళ రంగస్థల నటుడు, రచయిత, రజనీకాంత్ తోడల్లుడు వైజీ మహేంద్రన్ ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రజనీని దృష్టిలో పెట్టుకుని ఆయన ఓ నాటకం రాస్తున్నాడట.
ఇటీవల రజనీని కలసి, ఆయన కోసం నాటకం రాస్తున్నాననీ అందులో నటించాలనీ కోరాను. ఈ విషయంపై త్వరలోనే మళ్లీ ఆయనని కలుస్తాను. నా మాట ఆయన కాదనరనే నమ్మకం వుందంటూ ఏకంగా మీడియా ప్రకటన కూడా ఇచ్చేసారు వైజీ మహేంద్రన్. మరి రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రస్తుతం రజనీకాంత్ ‘లింగా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజనికి జోడిగా అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కెఎస్. రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్లైన్ వెంకటేష్ నిర్మాతగా రాక్లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియాలో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏ.అర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా వినాయక చవితి పురస్కరించుకుని విడుదలైన ఈచిత్రం ఫస్ట్లుక్కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కి తొలిరోజు 50 లక్షల హిట్స్ వచ్చాయి. ఆడియోని దీపావళికి రిలీజ్ చేసి సినిమాని రజనికాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.