twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ మహా నటుడి విగ్రహానికి నిప్పు పెట్టారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కన్నడ మహా నటుడు, దివంగత డాక్టర్ రాజ్ కుమార్ విగ్రహానికి తీవ్రమైన అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన విగ్రహానికి నిప్పు పెట్టి ధ్వంసం చేసారు. నవంబర్ 13న బంగలూరులోని బంగారప్ప లేఔట్ రాజేశ్వరి నగర్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విగ్రహంపై కిరోసిన్, పేపర్లు వేసి నిప్పంటించారు. నవంబర్ 23న ఈ విగ్రహం ఆవిష్కరణ జరుగాల్సి ఉంది. ఈలోపే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

    ఈ కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించారు. రాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై రాజ్ కుమార్ తనయుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ మాట్లాడుతూ...ఈ సంఘటనతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని తెలిపారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

     Rajkumar Family Demands Justice

    ‘ఇలా ఎందుకు చేసారు అర్థం కావడం లేదు. ఈ నెల 23న విగ్రహాన్ని ఆశిష్కరించాలని ప్లాన్ చేసాం. రాజ్ కుమార్ గారి పేరుతో మెమోరియల్ ట్రస్టు కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసాం. ఎవరో కావాలని మాపై జలసీతో ఈ చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యల వల్ల సాధించేది ఏమీ లేదు' అన్నారు రాఘవేంద్ర రాజ్ కుమార్.

    మరో వైపు రాజ్ కుమార్ విగ్రహానికి నిప్పు పెట్టడం కన్నడ సినీ పరిశ్రమ మొత్తం భగ్గుంది. ప్రముఖలంతా ఈ చర్యను ఖడించారు.

    English summary
    On November 13th, the whole Kannada film industry got a shocker when a statue of the late thespian Dr Rajkumar was damaged by some unknown miscreants. The miscreants tried to burn the statue situated at Bangarappa Layout in Rajarajeshwari nagar, using Kerosene and papers. The statue was placed on Wednesday and was supposed to be unveiled on November 23rd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X