Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ మహా నటుడి విగ్రహానికి నిప్పు పెట్టారు
హైదరాబాద్: కన్నడ మహా నటుడు, దివంగత డాక్టర్ రాజ్ కుమార్ విగ్రహానికి తీవ్రమైన అవమానం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆయన విగ్రహానికి నిప్పు పెట్టి ధ్వంసం చేసారు. నవంబర్ 13న బంగలూరులోని బంగారప్ప లేఔట్ రాజేశ్వరి నగర్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విగ్రహంపై కిరోసిన్, పేపర్లు వేసి నిప్పంటించారు. నవంబర్ 23న ఈ విగ్రహం ఆవిష్కరణ జరుగాల్సి ఉంది. ఈలోపే ఎవరో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ కేసును పోలీసులు సుమోటోగా స్వీకరించారు. రాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనపై రాజ్ కుమార్ తనయుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ మాట్లాడుతూ...ఈ సంఘటనతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని తెలిపారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.
‘ఇలా ఎందుకు చేసారు అర్థం కావడం లేదు. ఈ నెల 23న విగ్రహాన్ని ఆశిష్కరించాలని ప్లాన్ చేసాం. రాజ్ కుమార్ గారి పేరుతో మెమోరియల్ ట్రస్టు కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసాం. ఎవరో కావాలని మాపై జలసీతో ఈ చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యల వల్ల సాధించేది ఏమీ లేదు' అన్నారు రాఘవేంద్ర రాజ్ కుమార్.
మరో వైపు రాజ్ కుమార్ విగ్రహానికి నిప్పు పెట్టడం కన్నడ సినీ పరిశ్రమ మొత్తం భగ్గుంది. ప్రముఖలంతా ఈ చర్యను ఖడించారు.