రాఖీ ఎంతవరకూ వచ్చింది?

By Staff

అశోక్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమా రాఖీ. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న ఈ హీరోకి ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. అందుకే ఈ చిత్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారవుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌. నారాయణ, ఎస్‌. గోపాలరెడ్డి సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

రాఖీ షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా సాగుతోంది. ఫిలింసిటీలో కొన్ని యాక్షన్‌ దృశ్యాలతో పాటు పలు సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు కృష్ణవంశీ.

ఈ సినిమా ఎన్టీఆర్‌కు ఎంత ముఖ్యమో దర్శకుడు కృష్ణవంశీకి కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ చిత్రాన్ని కృష్ణవంశీ ఎంతో జాగ్రత్తగా మలుస్తున్నారని ఫిలింవర్గాల కథనం. రాఖీలో ఎన్టీఆర్‌ క్యారెక్టరైజేషన్‌ విభిన్నంగా ఉంటుంది. అయితే, ఈ సినిమా గురించి ఎటువంటి వివరాలూ బయటకి పొక్కకుండా చిత్రం యూనిట్‌ ఎంతో జాగ్రత్త వహిస్తోంది. ఒక కథనం ప్రకారం ఇది ప్రధానంగా చెల్లెలు సెంటిమెంట్‌తో కూడిన ఇతివృత్తం అని చెబుతున్నారు.

సికిందరాబాద్‌ శివార్లలో ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన సెట్‌ కూడా రూపొందించారు. కొంత భాగం, పాటలూ బ్యాంకాక్‌, పరిసర ప్రదేశాలలో షూటింగ్‌ చేశారు కూడా. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు.

డిసెంబర్‌ 22న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X