Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాఖీ ఎంతవరకూ వచ్చింది?
అశోక్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా రాఖీ. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న ఈ హీరోకి ఈ చిత్ర విజయం ఎంతో అవసరం. అందుకే ఈ చిత్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తయారవుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ, ఎస్. గోపాలరెడ్డి సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
రాఖీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా సాగుతోంది. ఫిలింసిటీలో కొన్ని యాక్షన్ దృశ్యాలతో పాటు పలు సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు కృష్ణవంశీ.
ఈ సినిమా ఎన్టీఆర్కు ఎంత ముఖ్యమో దర్శకుడు కృష్ణవంశీకి కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ చిత్రాన్ని కృష్ణవంశీ ఎంతో జాగ్రత్తగా మలుస్తున్నారని ఫిలింవర్గాల కథనం. రాఖీలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ విభిన్నంగా ఉంటుంది. అయితే, ఈ సినిమా గురించి ఎటువంటి వివరాలూ బయటకి పొక్కకుండా చిత్రం యూనిట్ ఎంతో జాగ్రత్త వహిస్తోంది. ఒక కథనం ప్రకారం ఇది ప్రధానంగా చెల్లెలు సెంటిమెంట్తో కూడిన ఇతివృత్తం అని చెబుతున్నారు.
సికిందరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన సెట్ కూడా రూపొందించారు. కొంత భాగం, పాటలూ బ్యాంకాక్, పరిసర ప్రదేశాలలో షూటింగ్ చేశారు కూడా. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.