Don't Miss!
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- News తనపై ఉన్న కేసుల వివరాలను వెల్లడించిన సీఎం జగన్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మళ్ళీ పాత ప్రియుడుతోనే సెక్స్ బాంబ్
ఒకప్పటి తన బాయ్ ఫ్రెండ్ అభిషేక్ అవస్థితో రాఖీ సావంత్ ఆడిపాడుతోంది. స్వయంవరం అనే రియాలిటీ షోలో ఈలేశ్ పరుజన్వాలాను ఎంచుకున్న ఈ సెక్స్ బాంబ్..తాజాగా అభిషేక్తోనూ 'జర నచ్కె దిఖా'లో ఆడి పాడింది. ఇది స్టార్ప్లస్లో ప్రసారమవుతుంది. తల్లుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం షూటింగ్ సందర్భంగా అభిషేక్, రాఖీలు తమ విభేదాలను మరిచి తిరిగి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి చాలా సేపు ఆడి పాడిన అనంతరం రాఖీ మాట్లాడుతూ తనకు లభించిన ఉత్తమ స్నేహితుల్లో అభిషేక్ ఒకరని మెచ్చుకుంది. ఈ షోకు హాజరైన అభిషేక్ తల్లి..కొడుకు మళ్లీ రాఖీతో కలిసి డాన్స్ చేయటాన్ని చూసి భావోద్వేగానికి గురయింది. రాఖీ అంటే తనకు ఎప్పుడూ ఇష్టమేనని..ఇక నుంచి ఆమెను కూతురులా చూసుకుంటానని ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.
అంతేకాదు..గతంలో బాధపెట్టినందుకు క్షమించాలని కూడా రాఖీ ఆమెను కోరడంతో అభిషేక్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక నుంచి తమ ఇద్దరి మధ్య విభేదాలను పక్కన పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. 'గతంలో జరిగిన వాటిని మర్చిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇక నుంచి ఇద్దరం కలిసే పనిచేస్తాం. శత్రుత్వాన్ని దరికి రానివ్వం. అయితే దీనర్థం మళ్లీ మేమిద్దరం చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నామని కాదు.. మేము మంచి స్నేహితులం మాత్రమే' అని అభిషేక్ స్పష్టం చేశాడు. రాఖీ, అభిషేక్లు ఘర్షణ పడ్డ తర్వాత దాదాపు రెండేళ్ల వరకు మాట్లాడుకోలేదు. తనకు కాబోయే వరుడిగా ఈలేశ్ ను ఎంపిక చేసుకున్న రాఖీ..అతనితో కలిసి పతీ పత్నీ ఔర్ వో అనే రియాల్టీ షోలోనూ పాల్గొంది. ఆ కార్యక్రమం చివరలో అతనితో అన్ని సంబంధాలనూ తెంచుకున్నట్టు ప్రకటించింది.