Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ గోపాల్ వర్మ త్రీడి ఎడ్వంచర్ చిత్రం డిటేల్స్
త్వరలో రామ్ గోపాల్ వర్మ రక్ష టైటిల్ తో ఓ త్రీడీ ఎడ్వంచర్ చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలియచేసారు. అవతార్ చిత్రం అధ్బుతమైన విజయం తనను త్రీడి చిత్రం రూపొందించే దిశగా అడుగులు వేయించిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాగే తను హైదరాబాద్ లో ఉండగా రామకృష్ణ సెవంటీ ఎమ్.ఎమ్ ధియోటర్ లో చూసిన ఛోటా చేతన్ చిత్రం ఇంకా గుర్తు ఉందన్నారు. అప్పుడే తొలిసారిగా త్రీడి అంటే తెలిసిందని చెప్పుకొచ్చారు.
చోటా ఛేతన్ చిత్రాన్ని చూడగానే ఆ వయస్సులో ఆశ్చర్యానికి గురయ్యానని,ఆ చిత్రం తన మదిలో గుర్తుండిబోయే విధంగా తయారైందని చెప్పారు. అయితే ఈ చిత్రం ప్రేరణతో తర్వాత వచ్చిన చిత్రాలు తనను ఇరిటేషన్ కు గురిచేసాయన్నారు. అలాగే కొంత కాలం క్రిందట తాను వార్నింగ్ పేరుతో ఓ త్రీడి హర్రర్ చిత్రం చేస్తానని ప్రకటించానని అయితే ఇప్పుడు దానని మానుకున్నానన్నారు. ఇప్పుడు తాను అవతార్ చూసాక రక్ష అనే టైటిల్ తో చిత్రం చేయాలనుకుంటున్నానని చెప్పారు.
హాలీవుడ్ మెకనాస్ గోల్డ్,రైడర్స్ ఆఫ్ లాస్ట్ ఆర్క్ వంటి చిత్రాలను తను పూర్తిగా అబిమానిస్తానని,అటువంటి చిత్రంలా సాహసాలతో కూడిన ప్రపంచాన్ని తన త్రీడి చిత్రంలో ఆవిష్కించనున్నానని చెప్పారు. ఇక ప్రస్తుతం రక్త చరిత్ర చిత్రం బిజీలో ఉన్నానని, ఈ చిత్రం అనంతరం ఈ చిత్రం షూటింగ్ ఉంటుందన్నారు.
ఇక రక్ష చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు టెన్షన్ సన్నివేశాలు సస్పెన్స్ తో కూడిన ట్విస్టులు ఉంటాయన్నారు. అలాగే క్యారెక్టర్స్ కూడా చాలా ఢిపెరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నానన్నారు. విజువల్ గా హైలెట్ గా ఉండి త్రిడీతో ఓ సినిమాటెక్ ఎక్సపీరియన్స్ ని ఆడియన్స్ కు కలిగించే దిశలో తన చిత్రం రూపొందుంతోందన్నారు. స్క్రిప్టు వర్క్ పూర్తిగా పూర్తయిందన్నారు. ఒకటి రెండు నెలల్లో నటీనటలు ఎంపిక పూర్తవతుందన్నారు.