Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మైనింగ్ డాన్ ‘గాలి’ కోసం హీరోయిన్ తాపత్రయం
మైనింగ్ మాఫియా డాన్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్న సంగతి తెలిసిందే. ఇత గాడి కోసం ఓ హీరోయిన్ తెగ తాపత్రయ పడుతోంది. అతన్ని కలిసి దీవెనలు తీసుకోవాలని గత కొంతకాలంగా ఆశగా ఎదురు చూస్తోంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ రక్షిత. ఎట్టకేలు ఆమె కోరి తీరింది. బుధవారం కర్నాటకలో గాలి జనార్ధన్ రెడ్డి ఉన్న జైలుకెళ్లి ఆయన్ను కలిసి దీవెనలు తీసుకుంది.
గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు స్థాపించిన బిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రక్షిత మార్చి 8న చేరిన విషయం తెలిసిందే. గాలికి వీర అభిమాని అయిన రక్షిత ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తోంది. అతన్ని అన్యాయంగా జైల్లో పెట్టారని, అతడు చాలా మంది మనిషి అని, ఎలాంటి తప్పులు చేయలేదని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, గాలి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అంటోంది.
రక్షిత గతంలో తెలుగులో రవితేజతో 'ఇడియట్', జూ ఎన్టీఆర్తో 'ఆంధ్రావాలా', నాగార్జునతో 'శివమణి' తదితర చిత్రాల్లో నటించింది. హీరోయిన్గా మంచి ఊపుమీద ఉన్నప్పుడే సినిమాల నుంచి తప్పుకుని పెళ్లి చేసుకున్న ఈ భామ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.