Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మైనింగ్ డాన్ ‘గాలి’ కోసం హీరోయిన్ తాపత్రయం
మైనింగ్ మాఫియా డాన్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్న సంగతి తెలిసిందే. ఇత గాడి కోసం ఓ హీరోయిన్ తెగ తాపత్రయ పడుతోంది. అతన్ని కలిసి దీవెనలు తీసుకోవాలని గత కొంతకాలంగా ఆశగా ఎదురు చూస్తోంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ రక్షిత. ఎట్టకేలు ఆమె కోరి తీరింది. బుధవారం కర్నాటకలో గాలి జనార్ధన్ రెడ్డి ఉన్న జైలుకెళ్లి ఆయన్ను కలిసి దీవెనలు తీసుకుంది.
గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు స్థాపించిన బిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రక్షిత మార్చి 8న చేరిన విషయం తెలిసిందే. గాలికి వీర అభిమాని అయిన రక్షిత ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తోంది. అతన్ని అన్యాయంగా జైల్లో పెట్టారని, అతడు చాలా మంది మనిషి అని, ఎలాంటి తప్పులు చేయలేదని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, గాలి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అంటోంది.
రక్షిత గతంలో తెలుగులో రవితేజతో 'ఇడియట్', జూ ఎన్టీఆర్తో 'ఆంధ్రావాలా', నాగార్జునతో 'శివమణి' తదితర చిత్రాల్లో నటించింది. హీరోయిన్గా మంచి ఊపుమీద ఉన్నప్పుడే సినిమాల నుంచి తప్పుకుని పెళ్లి చేసుకున్న ఈ భామ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.