Don't Miss!
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మైనింగ్ డాన్ ‘గాలి’ కోసం హీరోయిన్ తాపత్రయం
మైనింగ్ మాఫియా డాన్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కపెడుతున్న సంగతి తెలిసిందే. ఇత గాడి కోసం ఓ హీరోయిన్ తెగ తాపత్రయ పడుతోంది. అతన్ని కలిసి దీవెనలు తీసుకోవాలని గత కొంతకాలంగా ఆశగా ఎదురు చూస్తోంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ రక్షిత. ఎట్టకేలు ఆమె కోరి తీరింది. బుధవారం కర్నాటకలో గాలి జనార్ధన్ రెడ్డి ఉన్న జైలుకెళ్లి ఆయన్ను కలిసి దీవెనలు తీసుకుంది.
గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు స్థాపించిన బిఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రక్షిత మార్చి 8న చేరిన విషయం తెలిసిందే. గాలికి వీర అభిమాని అయిన రక్షిత ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తోంది. అతన్ని అన్యాయంగా జైల్లో పెట్టారని, అతడు చాలా మంది మనిషి అని, ఎలాంటి తప్పులు చేయలేదని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, గాలి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అంటోంది.
రక్షిత గతంలో తెలుగులో రవితేజతో 'ఇడియట్', జూ ఎన్టీఆర్తో 'ఆంధ్రావాలా', నాగార్జునతో 'శివమణి' తదితర చిత్రాల్లో నటించింది. హీరోయిన్గా మంచి ఊపుమీద ఉన్నప్పుడే సినిమాల నుంచి తప్పుకుని పెళ్లి చేసుకున్న ఈ భామ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.