ఎన్టీఆర్ తో సినిమా రూమర్స్ పై రకుల్ ఖండన
హైదరాబాద్ : రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం మాత్రం జారవిడుచుకుందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ సినిమాలోనూ రకుల్ నే హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చిత్రానికి కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేకపోవడంతో.. ఈ సినిమా నుంచి రకుల్ తప్పుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఖండిస్తూ, తాను చేస్తున్నానని రకుల్ ప్రీతి సింగ్ ట్వీట్ చేసింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రకుల్ ట్వీట్ లో .... "ఎన్టీఆర్ 25 వ చిత్రం చేస్తున్నాను. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అటువంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో భాగం కావటం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి రూమర్స్ ఎక్కడ నుంచి వస్తాయో తెలియటం లేదు ," అంటూ చెప్పుకొచ్చింది.
రామ్ 'పండగచేస్కో', రవితేజ 'కిక్-2', బాలీవుడ్ మూవీ 'శిమ్లా మిర్చి' చిత్రాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్... రామ్ చరణ్ సినిమాలో షూటింగ్ లోనూ పాల్గొంటోంది. మిగతా చిత్రాల షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ రామ్ చరణ్ సినిమా మాత్రం ఇటీవలే ప్రారంభమైంది. సెప్టెంబర్ నాటికి విడుదల తేదీ ప్రకటించడంతో వీలయినంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ సినిమా ఎక్కువభాగం లండన్ లో చిత్రీకరణ జరుపుకోనుంది.

రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతూ... కరెంట్ తీగలాంటి షాక్ లతో... కుర్రకారును తన అందాలతో కిర్రెక్కిస్తోంది. లౌక్యంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ... పండగచేస్కో సినిమాలో నటించడం మాటేమోకానీ... స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ.... కెరీర్ విషయంలోనూ నిజంగానే పండగచేస్కోంటోంది.
రవితేజతో నటిస్తున్న కిక్-2 విడుదల కాకముందే.. రామ్ చరణ్ సినిమాలో అవకాశం అందుకున్న రకుల్... మరోవైపు మహేశ్ సినిమాతో పాటు ఎన్టీఆర్-సుకుమార్ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. సో.. ప్రస్తుతం రకుల్ ఖాతాలో నలుగురు స్టార్ హీరోల సినిమాలున్నాయన్నమాట.
ఎన్టీఆర్ తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ తయారు చేసుకున్న కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసం హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్లను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరిలో ఎవరైనా హాండిస్తే రాశి ఖన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలస్తోంది. త్వరలోనే ఆ విషయం అనేది ఫైనలైజ్ కానుంది. ఈ చిత్రాన్ని ‘అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











