Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యువ హీరోతో రకుల్ ప్రీత్ దాగుడు మూతలు.. ప్రోసీడ్ అవుతుందో లేదో..
Recommended Video
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్ అని ఠక్కున సమాధానం వస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరోలతోపాటు, యువ హీరోలతో కూడా జత కడుతూ వరుస విజయాలను సొంతం చేసుకొంటున్నది. కేవలం టాలీవుడ్కే పరిమితం కాకుండా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నది. ఎప్పటికప్పుడు కథాబలం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ మల్టీస్టారర్ చిత్రానికి పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.
హరీష్ శంకర్ దాగుడు మూతలు
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ను అందించిన దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం దాగుడుమూతలు అనే మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. డీజే చిత్రాన్ని రూపొందించిన దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. ఈ చిత్రంలో నితిన్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు.
సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్
ఈ ఇద్దరు కుర్ర హీరోల సరసన నటించేందుకు ఇప్పటికే సాయి పల్లవిని ఎంపిక చేసుకోగా, మరో హీరోయిన్ రకుల్ పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం రకుల్తో డేట్లు, రెమ్యునరేషన్ తదితర విషయాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం.
రకుల్ ప్రీత్ నటిస్తుందా
దాగుడు మూతలు చిత్రంలో రకుల్ నటిస్తుందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే తన నిర్ణయాన్ని హరీష్ శంకర్కు చెప్పకుండా ఇంకా నాన్చుతున్నది అనేది ఫిలింనగర్ టాక్.
శర్వానంద్తో రకుల్
నితిన్తో సాయిపల్లవి జతకట్టనున్నది. శర్వానంద్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించే అవకాశం ఉంది. ఈ చిత్రం 2018 మార్చిలో సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారు.
ఐయారీ చిత్రంలో
కాగా రకుల్ ప్రస్తుతం ఐ యారీ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో హీరోగా సిద్దార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్పేయ్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకుడు. ఈ చిత్రం జనవరి 26న రిలీజ్కు సిద్ధమవుతున్నది.