Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సరైనోడు చిత్రం టాలీవుడ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకొన్నది. ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్గా రికార్డులను నెలకొల్పింది. ఆ సమయంలో అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. అలాంటి సరైనోడు చిత్రం ఏప్రిల్ 22వ తేదీ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ..
బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్
సరైనోడు మూవీపై అల్లు అర్జున్ ట్వీట్
సరైనోడు సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకొన్నది. నా కెరీర్లో ఓ మైలురాయిని సాధించిన చిత్రంగా మిగిలిపోయింది. బోయపాటి శ్రీను, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ త్రేసా, ఆది పినిశెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, గీతా ఆర్ట్స్, మిగితా యూనిట్ సభ్యులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు నా కెరీర్లో ఓ మధురానుభూతిని మిగిల్చారు. వారికి నేను రుణపడి ఉంటాను అని అల్లు అర్జున్ తెలిపారు.
అల్లు అర్జున్ ట్వీట్పై రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్
అల్లు అర్జున్ ట్వీట్పై రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్లో స్పందించారు. ఊరమాస్కు ఐదేళ్లు. అద్భుతమైన అనుభవాన్ని అందించినందుకు థ్యాంక్స్. ఆ మధురానుభూతులు ఎప్పుడూ మదిలో ఉంటాయి అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలోని రకుల్ సింగ్ పాత్రకు సినీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఏపీ, నైజాంలో సరైనోడు కలెక్షన్లు
సరైనోడు క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం నైజాంలో రూ.19.12 కోట్ల షేర్ను సాధించింది. ఇక ఏపీలో సీడెడ్లో రూ.10.73 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8.05 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.5.15 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలోరూ.4.52 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.4.08 కోట్లు, గుంటూరులో రూ.5.37 కోట్లు, నెల్లూరులో రూ.2.32 కోట్లు వసూళ్లతో రూ.59.34 కోట్లు కలెక్ట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సరైనోడు వసూళ్లు
ఇక సరైనోడు సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో రూ.6.25 కోట్లు, కేరళలో రూ.3.04 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.25 కోట్లు, అమెరికాలో రూ.2.97 కోట్లు, మిగితా దేశాల్లో రూ.1.02కోట్లు రాబట్టింది. దాంతో 2016లో ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.74 కోట్ల షేర్ను, రూ.127 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సరైనోడు నిలిచింది.