Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రధానితో రకుల్ సెల్ఫీ.. ఎమోషనల్ పోస్ట్
సమాజంపై సినిమా ప్రభావం.. సామాజిక బాధ్యత ఉన్న సినిమాల వల్ల కలిగే ప్రయోజనాలు, సంప్రదాయాలు, ఆచారాలు.. ఇలాంటి వాటిపై చర్చించేందుకు.. మార్పు మనలోనే మొదలవ్వాలి అనే కార్యక్రమాన్ని ప్రధాని ఏర్పాటు చేశారు. మహాత్ముని ఆలోచనలు అనుగుణంగా సాగడం.. మార్పు అనేది మనలోంచి మొదలవ్వాలనే అనే పాయింట్ మీద సినీ ఇండస్ట్రీతో ప్రధాని బేటీ అయ్యారు.
కదిలివచ్చిన బాలీవుడ్ తారాగణం..
ఈ కార్యక్రమంలో షారుఖ్, ఆమిర్, జాక్వెలిన్, కంగనా, రాజ్ కుమార్ హిరాణి, సోనమ్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు హాజరయ్యారు. ఇక వీరంతా ప్రధానితో కలిసి ముచ్చటించినట్టు తెలుస్తోంది. ప్రధానితో దిగిన సెల్ఫీలతో వీరంతా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ప్రధానితో సెల్ఫీ..
ప్రధానితో జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో రకుల్ కూడా పాల్గోంది. ఈ మేరకు ప్రధానితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. సమాజాన్ని ప్రభావితం చేసే సినిమా మాధ్యమం గురించి ప్రధాని చర్చించారు.. జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు మా అందరితో చర్చించారంటూ పోస్ట్ చేసింది.
|
ప్రధానికి విన్నవించిన ఉపాసన..
ప్రియమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, దక్షిణ భారతీయులమైన మేము.. మీ లాంటి వారు ప్రధానిగా ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము.. ఇంకా ఎంతో గర్వంగా ఉంది. ఈ సమావేశంలో కేవలంలో హిందీ పరిశ్రమకు సంబంధించిన వారినే ఆహ్వానించారు.. దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.. నా బాధను మీరు సరైన రీతిలో అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను.