Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాడా?? డిజాస్టర్ కాంబో.. మళ్లీనా?
‘స్పైడర్’ ఫలితం గురించి పట్టించుకోకుండా రకుల్తో ఇంకో సినిమా చేయడానికి మహేష్ బాబు ధైర్యం చేస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
మహేష్ కెరీర్లో ఆగడు తర్వాత ఆ రేంజ్ డిజాస్టర్ బ్రహ్మోత్సవం దాని తర్వాత వచ్చేసినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టి మళ్ళీ తన స్టామినా పెంచుకోవాలి అని చూసిన మహేష్ కి చుక్కెదురయ్యింది స్పైడర్ తో. వ్యక్తిగతంగా ఇప్పుడు మహేష్ ఫాలోయింగ్ కి గానీ, క్రేజ్ కి గానీ స్పైదర్ ఫ్లాప్ పెద్ద మచ్చ కాకపోవచ్చుగానీ, ఖాతాలో వరుస పరాజయాలు ఉండటం కూడా మంచిది కాదు. కానీ ఎవరూ తప్పించలేరుకదా ఇలా ఫ్లాప్ పడిపోయింది. అదీ కొందరు అభిమానులకి కూడా అసతృప్తిగానే ఉన్నా పైకి చెప్పలేనంత అసహనం. అయితే ఇక్కడ మహేష్ విషయం పక్కన పెడితే గమనించాల్సిన విషయం ఒకటుంది. అదే హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్
డిజాస్టర్ తప్పిందని సంతోషించింది
ముందు డిజాస్టర్ "బ్రహ్మోత్సవం" లో అసలు ముందు రకుల్ప్రీత్ సింగ్ నే అనుకున్నారట. కానీ డేట్లు సర్దుబాటు చేయలేక ఆ సినిమా ఓకే కాలేదు. మహేష్ లాంటి స్టార్ తో చాన్స్ మిస్సయ్యిందే అని ముందు బాధ పడ్డ రకుల్ తర్వాత మాత్రం ఒక డిజాస్టర్ తప్పిందని సంతోషించింది. ఐతే పాపం రకుల్ రెండోసారి మాత్రం తప్పించుకోలేకపోయింది. మురుగదాస్ లాంటి స్టార్ దర్శకుడితో మహేష్ కాంబినేషన్లో సినిమా చేసే అవకాశం దక్కిందని సంబరపడ్డ రకుల్కు చేదు అనుభవమే మిగిలింది.
Recommended Video
‘స్పైడర్' డిజాస్టర్
‘స్పైడర్' డిజాస్టర్ అయి.. ఆమె ఉత్సాహంపై నీళ్లు చల్లింది.ఐతే ఇప్పుడు వచ్చిన న్యూస్ కాస్త ఆశాజనకంగానే ఉంది (మనకి కాదు రకుల్ కి) ‘స్పైడర్' ఫలితం గురించి పట్టించుకోకుండా రకుల్తో ఇంకో సినిమా చేయడానికి మహేష్ బాబు ధైర్యం చేస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
రకుల్ ప్రీత్కే ఓటేశారట
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను'లో నటిస్తున్న మహేష్.. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరోయిన్కు పూజా హెగ్డేతో పాటు పలు పేర్లు పరిశీలించిన అనంతరం.. చివరికి రకుల్ ప్రీత్కే ఓటేశారట.
రకుల్ టాలెంట్ చూసి
‘స్పైడర్' రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులో రకుల్ టాలెంట్ చూసి.. తనకు మరో అవకాశం ఇవ్వడానికి మహేష్ అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు దిల్ రాజు-అశ్వినీదత్ ఉమ్మడిగా నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.