Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ తో అశ్వనీదత్ ఖరారు...డిటేల్స్
రామ్ చరణ్ తేజను 'చిరుత'గా పరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాత అశ్వనీదత్. ఎన్టీఆర్ తో చేసిన శక్తి చిత్రం డిజాస్టర్ కావటంతో నిరాశలో ఉన్న ఆయన మళ్లీ తన వైభవాన్ని పొందటానికి రామ్ చరణ్ తో చిత్రం నిర్మించటానికి కమిటయ్యారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభం కానుంది. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ...''రామ్చరణ్ హీరోగా సినిమా నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. 'చిరుత' చిత్రంతో మా సంస్థ నుంచే ఆయన తెరంగేట్రం చేశారు. మరోసారి చరణ్తో సినిమా తెరకెక్కిస్తుండటం సంతోషంగా ఉంది. చరణ్ శైలిలోని మాస్ అంశాలతో పాటు, శ్రీనువైట్ల తరహా వినోదమంతా ఇందులో ఉండబోతోంది.
అలాగే మహేష్బాబు-క్రిష్ కలయికలో తెరకెక్కనున్న చిత్రం ఆగస్టులో ప్రారంభమవుతుంది అన్నారు. ఇక గతంలో 'రాజకుమారుడు'తో మహేష్బాబును, 'చిరుత'తో రామ్చరణ్ను హీరోలుగా పరిచయం చేసిన అశ్వనీదత్ ఒకే ఏడాది ఈ ఇద్దరు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తుండడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ తాజా చిత్రం చరణ్ ఇమేజ్కి తగ్గట్టుగా, శ్రీనువైట్ల శైలిలో సరదాగా సాగిపోయే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిసింది.