Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ ఖరారు, గెస్ట్గా బన్ని... ఎక్కడంటే?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే(మార్చి 27) సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు అభిమాన సంఘాలకు చెందిన వారు అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. మార్చి 27న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చెర్రీ పుట్టిరోజు వేడుకలు జరుగనున్నాయి.
సాయంత్రం 5 గంటల నుంచి వేడుక ప్రారంభం అవుతుందని ఇప్పటికే అభిమానులందరికీ మెసేజ్ పాస్ చేసారు. మరో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నారు. చెర్రీ కేక్ కట్ చేసిన తర్వాత తొలి కేకు ముక్కను బన్నీ అందుకుంటారని, ఆ తర్వాత కొందరు అభిమానులకు విందు ఉంటుందని సమాచారం.
పుట్టిన రోజును పురస్కరించుకుని 'ఎవడు' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎవడు' చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'ఎవడు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.