Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్ మాస్ ఎంటర్ టైనర్ మొదలు: బోయపాటి, చెర్రీల సినిమా పూజ అయిపోయింది
మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ తదుపరి చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా ఈ రోజు లాంచనంగా ప్రారంభమైంది.
Recommended Video
బాలయ్య హీరోగా 'లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన మాస్ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా బోయపాటి మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమా మరెవరితోనో కాదు....మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో
రంగస్థలం 1985
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ జానర్ లో సరికొత్త ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2018 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా సెట్స్ మీద ఉండగానే చరణ్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు.
మాస్ ఎంటర్టైనర్
మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ తదుపరి చిత్రం చేయనున్నాడు. బోయపాటి సినిమాలు అంటేనే దాదాపు మాస్ ఎంటర్టైనర్గా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్గానే తెరకెక్కనుందని టాక్.
జనవరి నుంచి బోయపాటితో
రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం 1985 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటిస్తున్నారు. జనవరిలో రంగస్థలం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు డిసెంబర్లో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. జనవరి నుంచి బోయపాటితో సినిమా పట్టాలెక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
డివివి దానయ్య నిర్మాణంలో
రంగస్థలంలో చెర్రీ మాస్ లుక్లో కనిపించి అలరించనున్నారు. మరి ఈ సినిమాలో చెర్రీ లుక్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ సినిమా ఈ రోజు లాంచనంగా ప్రారంభమైంది. డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2018 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్
ధృవ, రంగస్థలం లాంటి ప్రయోగాలు చేసిన చరణ్ తన నెక్ట్స్ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాకు కూడా ఓకె చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది.