Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఈ సారి ‘ఎర్త్ అవర్’ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్
హైదరాబాద్: 2014 సంవత్సరం 'ఎర్త్ అవర్' బ్రాండ్ అంబాసిడర్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు చెర్రీ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను పోస్టు చేసాడు. ఈ నెల 29న రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటలకు వరకు ఎర్త్ అవర్ పాటించనున్నారు. ఎర్త్ అవర్లో పాల్గొనాలనుకునే వారు గంట పాటు విద్యుత్ వాడకం నిలిపి వేయాలి.
మనం రోజూ ఎన్నో గంటలు మన వృత్తి కోసం మన కుటుంబం కోసం వెచ్చిస్తాం. మనకు ప్రధాన జీవనాధారమైన భూమి గురించి సంవత్సరానికి ఒక గంట ఇవ్వలేమా? ఇదే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెల చివరి శనివారం నాడు ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు. భూమి మీద వాతావరణం మెరుగుపడేందుకు, సహజమైన పరిస్ధితులు నెలకొనేందుకు ప్రజల్లో జాగృతిని తెచ్చే ఆలోచనే ఈ ఎర్త్ అవర్.
గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం సాగుతోందని, ప్రపంచ వ్యాప్తంగా పట్టణాలు, నగరాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. భూమాత అందిస్తున్న వనరులు అధిక వినియోగమవుతున్నాయని, వాటిని తగ్గించుకుని ప్రకృతి సమతౌల్యానికి పాల్పడాలన్న సందేశంతో 'ఈ ఎర్త్ అవర్' కార్యక్రమం ప్రారంభమైంది.
కాలుష్యం పెరిగిపోవడం, ఆడవులు అంతరించిపోవడం, పర్యావరణ సమతుల్యత నశించడం వంటి కారణాల వల్ల భూమండలం వేడెక్కిపోతోంది. కాలుష్యం వల్ల ఓజోన్ పొర పలుచబడిపోతోంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక గంట విద్యుత్ నిలిపి వేసి ఎర్త్ అవర్ పాటించడం ద్వారా పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేసిన వారమవుతామనేది ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.