Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
నిశ్చితార్థం నమ్మలేకపోతున్నంటూ రామ్ చరణ్
రామ్ చరణ్, ఉపాసన కామినేనిల నిశ్చితార్థం ఈ రోజు (డిసెంబరు ఒకటి)వ తేదీన ఘనంగా జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎంగేజ్ మెంట్ విషయమై రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ...నేను మరికొద్ది గంటల్లో ఎంగేజ్ కాబోతున్నాననే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీ శుభాకాంక్షలు(విషెష్) అన్నిటికీ అడ్వాన్సెడ్ ధాంక్స్. లవ్ యు గైస్ అంటూ ట్వీట్ చేసారు. ఆయన తన ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేసారు.
రంగారెడ్డి జిల్లా మెయినాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఉన్న ఉపాసన కామినేని ఫామ్హౌస్లో ఈ కార్యక్రమం జరగనుంది. నిశ్చితార్థం మహూర్తం దగ్గరపడుతుండటంతో ఇందుకోసం ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి. సాయంత్రం 7.30 గంటలకు జరిగే ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి ఇరువర్గాల బంధువులతో పాటు, సినీ పరిశ్రమలోని సన్నిహితులు, రాజకీయనాయకులు హాజరుకానున్నారు. చిరంజీవి దగ్గరుండి ఈ నిశ్చితార్థం ఆహ్వాన పత్రికలను పంచుతున్నారు.
రామ్ చరణ్, ఉపాసన ల ఎంగేజ్ మెంట్ గిప్టుగా ఛార్టెడ్ ప్లైట్ ని ఇవ్వనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రామ్ చరణ్ కాబోయే శ్రీమతి ఉపాసన స్పందిస్తూ అట్లాంటి బహుమతిలు ఏమీ తమ కుటుంబం ఇవ్వటం లేదని ఖండించారు. అలాగే రామ్ చరణ్ కూడా అట్లాంటి వాటిని తీసుకోరని, ఆ డబ్బుని ఆయన ఛారెటీ పర్పస్ కి ఖర్చుపెడతారని అన్నారు.
ఇక ఎంగేజ్ మెంట్ కు వచ్చేవారు ఆహ్వాన పత్రికతో పాటు, బార్కోడ్ ఉన్న ఓ కార్డును ఇస్తున్నారు. కార్యక్రమానికి వచ్చే వారు దీనిని వెంటబెట్టుకుని రావాలి. ఇది ఎంట్రెన్స్లో యాక్సెస్ అయితేనే లోపలికి ప్రవేశం ఉంటుంది. భద్రతా కారణాల రీత్యా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమం కోసం మూడంచెలుగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమని, అభిమానులకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి రామ్ చరణ్, ఉపాసన కామినేనులను పరిచయం చేయనున్నామని సంబంధీకులు తెలిపారు.