Don't Miss!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిన్న జూ ఎన్టీఆర్, నేడు రామ్ చరణ్ మీడియా పై గరం గరం...!?
జూ ఎన్టీఆర్ వివాహమాడబోయే లక్ష్మీప్రణతి జాతకం బాగుండకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఛానల్స్ లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ ఛానల్ కి సంబంధించిన వారిని జూ ఎన్టీఆర్ పిలిపించి వారి మీద సీరియస్ అయ్యాడన్న విషయం కూడా తెలిసిందే.
కాగా చరణ్ కూడా మీడియాకి క్లాస్ పీకాడని సమాచారం. నిజానిజాలు తెలుసుకోకుండా సంచలనాలకోసం తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడం దురదృష్టకరమని ఇటీవలే ఓ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశాడు. సంచలనాలకోసం కాకుండా, ప్రజలకు మేలు చేసే వార్తల్ని ప్రసారం చేయాలనీ, తద్వారా వీక్షకుల మెప్పు పొందాలని చరణ్ అభిలషించాడు. లోకల్ టీవీ మీడియాలో వివిధ విభాగాలకు అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్, మీడియాపై డైరెక్ట్ గా విమర్శనాస్త్రాలు వదిలాడు.
చరణ్ ఇంతగా మీడియాపై ఆవేదన వ్యక్తం చేయడం వెనుక, గతంలో తనకూ, 'చిరుత" సినిమా హీరోయిన్ కీ పెళ్ళయిపోయిదంటూ అప్పట్లో గాసిప్స్ రావడం ఓ కారణమైతే, ఇటీవలే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ చేస్తోన్న ఆరోపణలు, వాటికి మీడియా ఇస్తోన్న ప్రాధాన్యత కూడా మరో కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరేం చెబితే దాన్ని ప్రసారం చేయడం కాకుండా, వాస్తవాల్ని తెలుసుకుని, ఆ వార్తల్ని ప్రసారం చేస్తే మీడియ అంటే ప్రజలకు గౌరవం పెరుగుతుందని చరణ్ వ్యాఖ్యానించడం, దానికి అదే కార్యక్రమంలో హాజరైన మీడియా ప్రతినిథులు అభినందనలు తెలియజేయడం గమనార్హం.