twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్న జూ ఎన్టీఆర్, నేడు రామ్ చరణ్ మీడియా పై గరం గరం...!?

    By Sindhu
    |

    జూ ఎన్టీఆర్ వివాహమాడబోయే లక్ష్మీప్రణతి జాతకం బాగుండకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఛానల్స్ లో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ ఛానల్ కి సంబంధించిన వారిని జూ ఎన్టీఆర్ పిలిపించి వారి మీద సీరియస్ అయ్యాడన్న విషయం కూడా తెలిసిందే.

    కాగా చరణ్ కూడా మీడియాకి క్లాస్ పీకాడని సమాచారం. నిజానిజాలు తెలుసుకోకుండా సంచలనాలకోసం తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడం దురదృష్టకరమని ఇటీవలే ఓ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశాడు. సంచలనాలకోసం కాకుండా, ప్రజలకు మేలు చేసే వార్తల్ని ప్రసారం చేయాలనీ, తద్వారా వీక్షకుల మెప్పు పొందాలని చరణ్ అభిలషించాడు. లోకల్ టీవీ మీడియాలో వివిధ విభాగాలకు అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్, మీడియాపై డైరెక్ట్ గా విమర్శనాస్త్రాలు వదిలాడు.

    చరణ్ ఇంతగా మీడియాపై ఆవేదన వ్యక్తం చేయడం వెనుక, గతంలో తనకూ, 'చిరుత" సినిమా హీరోయిన్ కీ పెళ్ళయిపోయిదంటూ అప్పట్లో గాసిప్స్ రావడం ఓ కారణమైతే, ఇటీవలే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ చేస్తోన్న ఆరోపణలు, వాటికి మీడియా ఇస్తోన్న ప్రాధాన్యత కూడా మరో కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరేం చెబితే దాన్ని ప్రసారం చేయడం కాకుండా, వాస్తవాల్ని తెలుసుకుని, ఆ వార్తల్ని ప్రసారం చేస్తే మీడియ అంటే ప్రజలకు గౌరవం పెరుగుతుందని చరణ్ వ్యాఖ్యానించడం, దానికి అదే కార్యక్రమంలో హాజరైన మీడియా ప్రతినిథులు అభినందనలు తెలియజేయడం గమనార్హం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X