Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అపోలో కి గ్లామర్ అద్దుతున్న రామ్ చరణ్
హైదరాబాద్: అపోలో హాస్పటిల్ వారి అల్లుడైన రామ్ చరణ్ ఆ హాస్పటిల్ కి గ్లామర్ అద్దుతున్నారు. హాస్పటిల్ ప్రాగణంలో తొమ్మిది కోట్ల వ్యయంతో ఓ జిమ్ ని నిర్మించారు. అక్కడికి వర్కవుట్ చేయటానికి టాలీవుడ్ హీరో,హీరోయిన్స్ వస్తారని అంచనా. అంటే అపోలో ఆవరణలో పేషెంట్స్ మాత్రమే కాక ఇకనుంచి సినిమా స్టార్స్ కూడా కనిపించనున్నారన్నమాట. ఈ జిమ్ చాలా ఆధునికంగా ఉండనుందని సమాచారం. తన బార్య ఉపాసన ఆధ్వర్యంలో దీన్ని రామ్ చరణ్ నడపనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఎవడు చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో ప్రక్క ఈ సినిమా అనంతరం జంజీర్ రీమేక్ లో పాల్గొంటారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సినిమాలోనూ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలూ మాస్ ని టార్గెట్ చేసినవే కావటం విశేషం. ఆరెంజ్ ప్లాప్ కావటంతో రామ్ చరణ్ పూర్తిగా తన తండ్రి నటించిన సూపర్ హిట్స్ తరహా పాత్రలనే ఎంచుకోవటానికే ఆసక్తి చూపుతున్నారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.