twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్న కోసం పాటపాడిన రామ్ చరణ్

    By Staff
    |

    Ram Charan Teja
    మెగాస్టార్ చిరంజీవి రేపటి నుంచి(తొమ్మిదివ తేదీ) చేయనున్న ప్రజా అంకిత యాత్రలో ప్లే చేయటానికి ఐదు పాటలు రెడీ చేస్తున్న సంగతి తెలిసింది. వాటిలో మూడు తిరుపతి సభలో ప్లే చేసారు. ఇక మిగిలిన రెండు పాటలు రామ్ చరణ్ తేజ చేత పాడించి రికార్డ్ చేయిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో ఈ సాంగ్స్ ప్రాణం పోసుకోనున్నాయి. ఇప్పటికే చరణ్ ఈ పాటలను బాగా ప్రాక్టీస్ చేసాడని తెలుస్తోంది.

    చరణ్ గొంతు చాలా బాగుంటుందని దేవీనే చెప్పటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక నాన్న కోసం కాకపోతే గళం విప్పే ప్రశక్తి లేదని తన తండ్రి ప్రచారానికి తోడుగా తన పాటలను పంపుతున్నానని తన శ్రేయాభిలాషులతో చరణ్ భావోద్వేగంగా చెప్పాడని వినికిడి. అయితే ఈ పాటలు క్లిక్ అయితే రానున్న కాలంలో గాయకుడు కమ్ హీరో తెలుగుకు లభిస్తాడని సీనియర్స్ అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ఈ వ్యవహారమంతా ఓ స్ట్రాటజీ ప్రకారమే నని రామ్ చరణ్ కు ఇప్పుడిప్పుడే యూత్ లో పెర్గుతున్న క్రేజ్ ని కూడా క్యాష్ చేసుకోవాలనే తపనే దీనికి ఉసి గొల్పిందని కొందరు డైరక్టుగానే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా బెస్ట్ ఆఫ్ లక్ చరణ్

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X