Don't Miss!
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- News మేషరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగా అభిమాని మరణం.. ఫ్యామిలీని ఆదుకునేందుకు రంగంలోకి రామ్ చరణ్
మెగాభిమానులకు మెగా హీరోలు ఎంత ప్రాధాన్యమిస్తారో అందరికీ తెలిసిందే. అభిమానులే తమకు ఆస్తి, ప్రాణం అంటూ చెప్పుకునే మెగా హీరోలు.. అభిమానుల పట్ల అంకిత భావంతో ఉంటారు. అలాంటి అభిమానుల్లోంచి ఓ వీరాభిమాని ఆదివారం మరణించాడు. అతనెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుకొన్ని సాయి ధరమ్ తేజ్ వరకు మెగా హీరోలందరికీ గొప్ప అభిమానిగా పేరు తెచ్చుకున్నాడు నూర్ భాయ్.
మెగా అభిమాని నూర్ భాయ్..
గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన అనారోగ్యంతో ఈరోజు కన్నుమూశాడు. ఈ సంగతి తెలిసిన మెగా అభిమానులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. సోషల్ మీడియా మొత్తం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
అభిమానులే కుటుంబం..
‘ఫ్యాన్సే ఫ్యామిలీ. నూర్ మహ్మద్ గారిని మేమంతా మిస్ అవుతాము. అతని పాజిటివ్ అండ్ హెల్పింగ్ నేచర్ ఎంతో మంది స్ఫూర్తిధాయకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి'అంటూ రామ్ చరణ్ స్పందించాడు. ‘మెగాఫ్యాన్స్ అనే ఫ్యామిలీ.. స్ట్రాంగెస్ట్ పిల్లర్ను కోల్పోయింది. నూర్ భాయ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి, అతని కుటుంబానికి బలం చేకూరాలి, నా మద్దతు వారికి ఉంటుంది'అంటూ సాయి ధరమ్ తేజ్ పోస్ట్ చేశాడు.
కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి..
ఎన్నో యేళ్ల నుంచి మెగా ఫ్యామిలీకి అభిమానిగా, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న నూర్ మహ్మద్ నేడు మరణించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి.. అభిమాని ఇంటికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించాడు. నూర్ మరణ వార్తను తెలుసుకున్న అల్లు అర్జున్ సైతం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చాడు. కుటుంబాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పది లక్షల సాయాన్ని అందజేసిన చెర్రీ
తాజాగా నూర్ కుటుంబాన్ని కలుస్తానని చరణ్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. అలాగే ఆ కుటుంబానికి 10 లక్షలు విరాళం ప్రకటించారు. అనంతరం నూర్ భాయ్ సేవల్ని గుర్తు చేసుకున్నారు. నూర్ భాయ్ మెగా అభిమానులందరిలోకి గొప్ప వ్యక్తి అని, ఆయన మెగా ఫ్యామిలీ పేరిట ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించారని చెప్పుకొచ్చాడు
Recommended Video
ఎన్నో సేవా కార్యక్రమాలు..
మా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేశారని గుర్తు చేసుకున్నాడు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నాడు. ఒకసారి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తానే స్వయంగా అక్కడికి వెళ్లి పరామర్శించి వచ్చానని పేర్కొన్నాడు. అక్కడ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం చేయించానని తెలిపాడు. కానీ నిన్న మరణ వార్త విని చలించిపోయానని భావోద్వేగానికి లోనయ్యాడు.