Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ కి స్పెషల్ శేర్వాణి ఖరీదు ఒకటిన్నర లక్ష...!
డిసెంబరు 1వ తేదీన మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తేజ, అపోలో హాస్పిటల్స్ రెడ్డి మనవరాలు ఉపాసనల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలోనే ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎంగేజ్ మెంట్ వేడుక హైదరాబాద్ లోని ఉపాసనాకు చెందిన రిసార్ట్ ముస్తాబయ్యింది. దాదాపు 300మంది గెస్ట్ లు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ వేడుక కోసం డిజైనర్ రాజేష్ ప్రతాప్ సింగ్ రూ. 1.5 లక్షలతో రామ్ చరణ్ కి శేర్వాణి డిజైన్ చేసాడట. చోటా కె నాయుడు ఈ వేడుకను తన కెమెరాలో బంధించనున్నాడు.
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి పర్యవేక్షణలో ఈ వేడుకకు కావాల్సిన వేదిక, మిగతా డెకరేషన్ అరేంజ్ మెంట్స్ జరిగాయని సమాచారం. మజార్, గౌరవ్ క్యాటరింగ్ అరేంజ్ మెంట్స్ ని చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వేడుకను ఇటు చిరంజీవి కుటుంబ సభ్యులు, అటు ఉపాసనా కుటుంబ సభ్యులు చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేసారట.