Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మీడియాపై మండిపడుతున్న రామ్ చరణ్ తేజ్
నిన్న తెలుగు మీడియా ముఖ్యంగా టీవీ ఛానెల్స్ అన్నీ... రామ్ చరణ్ యాక్సిడెంట్ పాలయ్యారు. ఆ తర్వాత ..హీరో రామ్ చరణ్ తేజ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఆ తర్వాత ఆయన సేఫ్ గా ఉన్నారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదం నుంచి తప్పించుకోవటం వరకూ నిజమే అయినా దానికి అంత పబ్లిసిటీ ఇవ్వటంతో ఎక్కడెక్కడనుంచి చరణ్ కీ,చిరంజీవికి,ఆయన కుంటాభానికి ఫోన్స్ వస్తున్నాయట. దర్శకుడు సంపత్ నంది కి కూడా ఎడతెగని ఫోన్స్ కంటిన్యూగా వస్తున్నాయి. దాంతో ఆయన ఈ వార్తను బయిటకు ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నారు. మరో ప్రక్క అల్లు శిరీష్ ట్విట్టర్ ...మాత్రం ఈ యాక్సెడెంట్ గురించి ట్విట్టర్ లో రాసి మరింత ప్రాచుర్యం కల్పించారు. అలా ఈ న్యూస్ దావానలంలా వ్యాపించింది. ఇక చరణ్ మాత్రం ... "నాలుగేళ్ల తర్వాత 'రచ్చ' ఇంట్రడక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం నేనెంతో ఇష్టపడే గోవాకి వచ్చా.
ఇక్కడ బాగా వేడిగా ఉంది. ఔట్డోర్ ఎ.సి.ని కనిపెట్టాలి'' అని ట్విట్టర్లో తెలిపారు. ఇక గోవాలో జరుగుతున్న 'రచ్చ' షూటింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఫైట్మాస్టర్ అలన్ అమీన్ సారథ్యంలో రామ్ చరణ్ తేజ్ ఇంట్రడక్షన్ ఫైట్ని చిత్రీకరిస్తున్నారు.అయితే ఈ ఫైట్ సన్నివేశం తీసేప్పుడు అనుకోని ప్రమాదం సంభవించింది. ఓవైపు ట్రైన్ వస్తుండగా, మరోవైపు కారులోంచి రామ్ చరణ్ తేజ్ వేగంగా ట్రాక్ దాటే సీను తీస్తున్న సమయంలో కేబుల్స్ తెగిపోయాయి. దాంతో ట్రైన్ వేగంగా రామ్ చరణ్ తేజ్ ఉన్న కారువేపు వచ్చేసిందనీ, అయితే చరణ్ సహా అక్కడున్న వాళ్లంతా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. మెగా సూపర్గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్నారు.