Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
గోవిందుడు షో: మెగా ఫ్యాన్స్ ఆందోళన, పోలీసుల ఎంట్రీ
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. అభిమానుల కోసం వివిధ ప్రాంతాల్లో ఉదయం 5.18 గంటలకే బెనిఫిట్ షోలు ఏర్పాటు చేసారు. అయితే హైదరాబాద్ కూకటపల్లిలోని విశ్వనాథ్ 70 ఎంఎం థియేటర్లో గంధరగోళ పరిస్థితి నెలకొంది.
ఉదయం 5.18కి షో ప్రారంభం కావాల్సి ఉండగా....శాటిలైట్ టెక్నికల్ సమస్య కారణంగా ఆలస్యంగా ఉదయం 6 గంటల తర్వాత షో మొదలైంది. ఫస్టాఫ్ ముగిసే వరకు ఉదయం 7.30 గంటలయింది. అయితే మళ్లీ టెక్నికల్ సమస్య రావడంతో సెకండాఫ్ దాదాపు గంటన్నర ఆలస్యంగా 9 గంటలకు ప్రారంభమైంది.
ఈ గ్యాపులో మెగాఫ్యాన్స్ థియేటర్లో ఆందోళనకు దిగారు. ప్రొజెక్టర్ రూంలోకి చొచ్చుకెళ్లారు. వెంటనే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన కొందరు పోలీసులు థియేటర్లోకి వచ్చి ప్రొజెక్టర్ రూంలోకి చొచ్చుకెళ్లిన వారిని బయటకు పంపారు. పోలీసుల భద్రత మధ్య సమస్య సరిచేసారు. 9 గంటలకు షో ప్రారంభం కావడంతో అంతా సద్దు మనిగింది.
ఒక్కో
టిక్కెట్
700పైనే...
తొలి
రోజు,
తొలి
షో
చూడాలనే
అభిమానుల
వీక్
నెస్
ఆసరాగా
చేసుకుని
షో
నిర్వాహకులు
ఒక్కో
టికెట్
రూ.
700
నుండి
800
వందల
వరుకు
బ్లాక్
లో
అమ్మడం
గమనార్హం.
స్పెషల్
మార్నింగ్
షో
పేరుతో
ప్రత్యేకంగా
టిక్కెట్లు
ముద్రించారు.
ఆ
టిక్కెట్లపై
రేటు
ముద్రించి
లేక
పోవడంతో
ఇష్టం
వచ్చిన
రేటుకు
బ్లాక్
లో
అమ్మారు.
ఇంత
రేటు
పెట్టి......ఆలస్యంగా
సినిమా
చూడటంపై
పలువురు
ఫ్యాన్స్
ఆందోళన
వ్యక్తం
చేసారు.