twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాలకు బ్రేక్ వేసిన రామ్ చరణ్!

    By Bojja Kumar
    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాత్కాలికంగా తన సినిమా షూటింగులకు బ్రేక్ వేశారు. జూన్ 14న చెర్రీ వివాహం తను మనసు పడ్డ ప్రేయసి ఉపాసనతో జరుగనున్న నేపథ్యంలో 15 రోజుల ముందుగానే బ్రేక్ తీసుకున్నారు. పెళ్లి, తదనంతర కార్యక్రమాలతో పాటు హనీమూన్ ట్రిప్ ముగిసే వరకు చెర్రీ సినిమాలుకు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని చరణ్ త ట్విట్టర్లో పేర్కొన్నాడు. 'Atlast free frm all the shoots till the wedding..' అంటూ ట్వీట్ చేశాడు.

    ప్రస్తుతం చరణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. చెర్రీ బాలీవుడ్ డెబట్ చిత్రం 'జంజీర్'తో పాటు...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు', మరో వైపు వివి వినాయక్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న 'చెర్రీ' చిత్రం షూటింగులు జరుగుతున్నాయి.

    వీరి వివాహం మొయినాబాద్ ప్రాంతంలోని ఉపాసన ఫాం హౌజ్‌లో జరుగనుంది. ఇరు కుటుంబాల వారు రాజకీయంగా, సీనీ రంగంలో భాగా పలుకు బడి ఉన్న వారు. ఈ నేపథ్యంలో తమ ముద్దుల వారసులు రామ్ చరణ్, ఉపాసన వివాహం దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈ వెంట్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ వేడుక కోసం సినిమాలో మాదిరి భారీ సెట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బాధ్యతను టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి అప్పగించారు. ఇందుకోసం దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    English summary
    Ram Charan has said a Temporary Good Bye to films and film shootings. With marriage date scheduled for June 14, Mega family members are deeply immersed looking into all the arrangements for Sangeet, Marriage and Reception. 'Atlast free from all the shoots till the wedding..' Ram Charan tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X