Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లువారబ్బాయికి రామ్ చరణ్ సలహా.. ఇంతకీ వర్కవుటయ్యేనా?
కెరీర్లో సరైన హిట్ కొట్టి సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని తహతహలాడుతున్నాడు అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి అల్లు అరవింద్ బడా నిర్మాతగా, అన్న అల్లు అర్జున్ టాప్ స్టార్ గా కొనసాగుతుండటంతో వారి బాటలోనే అల్లు శిరీష్ కూడా ఆ స్థాయికి ఎదగాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మేరకు వరుస సినిమాలు చేస్తున్నా కూడా ఇతగాడికి సరైన హిట్ పడకపోవడంతో రామ్ చరణ్ ఓ సలహా ఇచ్చారట. వివారాల్లోకి వెళ్తే..
అల్లు శిరీష్ తాజా సినిమా ఏబీసీడీ. మలయాళంలో ఇదే పేరుతో విడుదలై సూపర్ హిట్ సాధించిన చిత్రానికి రీమేక్ ఈ మూవీ. తన మేనమామ కొడుకు అల్లు శిరీష్ కెరీర్ గాడిలో పడాలంటే ఎలా ఆలోచించిన రామ్ చరణ్.. అతనికి ఓ విలువైన సలహా ఇచ్చారట. మలయాళంలో వచ్చిన ఏబీసీడీ చిత్ర రీమేక్ లో నటించు. నీ బాడీ లాంగ్వేజ్ కి ఇది సరిగ్గా సూట్ అవుతుందని శిరీష్ తో చెప్పారట రామ్ చరణ్. అంతేకాదు మలయాళ ఏబీసీడీ సీడీ తెచ్చిచ్చి వెంటనే ఈ సినిమా చూడమని చెప్పాడట. సినిమా చూడగానే శిరీష్ కి కూడా ఈ మూవీ బాగా నచ్చడంతో చెర్రీ సలహా మేరకు దర్శక నిర్మాతలను వెతికే పనిలో పడ్డాడట శిరీష్. అందుకే ఈ సినిమా ఇంత లేట్ అయిందట. ఈ విషయాలన్నీ అల్లు శిరీషే స్వయంగా వెల్లడించారు. సోమవారం జరిగిన ఏబీసీడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వేదికపై ఈ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు శిరీష్.
మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్పై మధుర శ్రీధర్ రెడ్డి , బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఏబీసీడీ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాజా, కోటా శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 17 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.