Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్ యాక్సిడెంట్ మ్యాటర్ పై అఫీషియల్ గా...
హైదరాబాద్ : రామ్ చరణ్ కి నాయక్ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తూండగా..యాక్సిడెంట్ అయ్యిందని, అపోలోలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై రామ్ చరణ్ పబ్లిసిస్ట్ అఫీషియల్ గా మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ విషయాన్ని ఖండించారు. కేవలం రూమర్ అని కొట్టిపారేసారు.
పబ్లిసిస్ట్ మాటల్లో... " మెగా పవర్ స్టారక్ రామ్ చరణ్ ఏ యాక్సిడెంట్ కి గురి కాలేదు. అలాగే ఏ గాయమూ అవలేదు..ఏ విధమైన ట్రీట్ మెంట్ తీసుకోవటం లేదు. ఆయన ఆరోగ్యంగా బావున్నారు. నాయక్ షూటింగ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసారు. దయఉంచి ఏ రూమర్స్ ని నమ్మవద్దు. ," అన్నారు. అలాగే ఈ యాక్సిడెంట్ మ్యాటర్ కొందరు రూమర్స్ క్రియేట్ చేసే వారి సృష్టి అని తేల్చారు.
రామ్చరణ్ హీరోగా యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్'చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని జనవరి 12,2013 న అంటే సంక్రాంతికి విడుదల చేయటానికి నిర్ణయించారు.
ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, రాహుల్దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్.