Don't Miss!
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ రోజే జాయిన్ అయిన రామ్ చరణ్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తాజాగా ఈ రోజు(ఆగస్టు 7) 'ఎవడు' షూటింగులో జాయిన్ అవుతున్నాడు. కొన్ని వారాలుగా చెర్రీ బాలీవుడ్ మూవీ జంజీర్ రీమేక్, వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగుల్లో పాల్గొంటూ వస్తున్నాడు.
ఎవడు చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత, అమీ జాక్స్ హీరోయిన్లు. సమంత ఈ సినిమా నుంచి ఔట్ అయింది అనే వార్తలు వస్తున్న ఇంకా సరైన క్లారిటీ రాలేదు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఒకరకంగా ఈచిత్రాన్ని మినీ మల్టీ స్టారర్ మూవీగా చెబుతున్నారు 'ఎవడు' యూనిట్ సభ్యులు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి అద్భుతమైన బాణీలు సమకూర్చుతున్నారు. జనవరిలో ఈచిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.