Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
‘మగధీర’లా ఈ చిత్రం నిలవాలి:రామ్చరణ్
హైదరాబాద్:''చంటిగారు ఈ సినిమా గురించి చెప్పగానే 'ఈ టైటిల్ నరేష్ తీసుకున్నాడా' అనిపించింది. కానీ ఈ తరంలో ఈ టైటిల్కి న్యాయం చేయగల హీరో నరేషే అనిపించింది. తనంత బాగా ఎవరూ కామెడీ చేయలేరు. తను 'చంటబ్బాయ్' సినిమా కూడా చెయ్యాలి. నా కెరీర్లో 'మగధీర' ఎలా నిలిచిపోయిందో అలా ఈ చిత్రం నరేష్కి నిలిచిపోవాలని కోరుకుంటున్నాను'' అని రామ్ చరణ్ అన్నారు. అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'యముడికి మొగుడు' ఆడియో పంక్షన్ కి ముఖ్య అతిధిగా హాజరైన రామ్ చరణ్ ఈ విధంగా స్పందించారు.
ఆడియో సీడీని రామ్చరణ్ ఆవిష్కరించి వినాయక్కి ఇచ్చారు. వన్ మినిట్ టీజర్ని యమపాశం విదిలించి వీవీ వినాయక్ ఆవిష్కరించారు. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో అడ్డాల చంటి నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి కోటి సంగీతం అందించారు. ఈ పాటలను ఆదివారం హైదరాబాద్లో విడుదల చేశారు. యముడి నేపథ్యంలో రూపొందిన చిత్రం కావడం వల్ల యాంకర్లు యముడు, చిత్రగుప్తుడి గెటప్స్లో ప్రత్యక్షమయ్యారు. విచ్చేసిన అతిథులకు యమపాశం ఇచ్చి నవ్వించారు. ఆ పాశాన్ని విదిలించి ఒక్కో పాటను ఆవిష్కరించారు.
హీరో
అల్లరి
నరేష్
మాట్లాడుతూ
-
''నేను
మొదటిసారి
సోషియో
ఫాంటసీ
చిత్రం
చేశాను.
అందరూ
ఆదరిస్తారనే
నమ్మకం
ఉంది''
అన్నారు.
''యముడి
నేపథ్యంలో
వచ్చిన
అన్ని
చిత్రాలు
రికార్డు
సృష్టించాయి.
ఈ
చిత్రం
కూడా
విజయం
సాధిస్తుందని
ఆశిస్తున్నాను''
అని
సత్తిబాబు
చెప్పారు.
చాలాకాలం
తర్వాత
ఒక
మంచి
సినిమాతో
మీ
ముందుకు
వస్తున్నందుకు
ఆనందంగా
ఉందని
చంటి
అన్నారు.
ఈ
వేడుకలో
బి.గోపాల్,
భీమినేని
శ్రీనివాసరావు,
అశోక్కుమార్,
చలపతిరావు,
నాని,
శర్వానంద్,
తనీష్,
వైభవ్రెడ్డి
తదితరులు
పాల్గొన్నారు.