Don't Miss!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
2009 విజయాన్ని తిరగరాస్తా ‘మగధీరు’డు
రామ్ చరణ్ 2007లో 'చిరుత" గా విజృంభించి 2009 లో 'మగధీర" గా అద్భుతమైన విజయాన్ని సాధించి తెలుగు సినిమా చరిత్రలో రికార్డులు నెలకొల్పిన రామ్ చరణ్ 2010లో కూడా అటువంటి విజయాన్నే సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. తన రెండవ చిత్రంతోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ తర్వాత చిత్రం 'ఆరెంజ్". ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు నాగబాబు నిర్మాత. జెనీలియాతో పాటు మరో బాలీవుడ్ అమ్మాయి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో తమిళనటుడు ప్రభు ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండగా మరో హీరో సుమన్ కూడా ఓ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో సుమన్ పాత్ర సినిమాకు ఎంతో కీలకం అంటున్నాడు దర్శకుడు. అయితే భాస్కర్ ప్రతి చిత్రంలో ప్రకాష్ రాజ్ కు ఓ ప్రత్యేక పాత్ర వుంటుంది. ఆ పాత్రను ఈ చిత్రంలో సుమన్ చేత చేయిస్తున్నాడా! ఎందుకంటే ఇంత వరకు ప్రకాష్ రాజ్ మాట రాలేదు. అనుకుంటున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఈ చిత్రంలో గెస్ట్ పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని చరణ్ ఖాతాలో మరో బిగ్ హిట్ కు రెడీ అవుతుందని ఈ చిత్రం నిర్మాత నాగబాబు తెలియజేశారు.