Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నారీ నారీ నడుమ... రామ్ చరణ్
హైదరాబాద్: రామ్ చరణ్ ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్స్ మధ్యన నలిగిపోతున్నారు. ఒకళ్లు ఇటు లాగితే మరొకరు మరో వైపుకు లాగుతున్నారు. దాంతో ఆయన తట్టుకోలేక ఓ పాట అందుకున్నారు. ఇదంతా రామ్ చరణ్ 'నాయక్' సినిమా కోసం. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రమిది. కాజల్, అమలా పాల్ హీరోయిన్స్. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్లో చరణ్ ఇద్దరు హీరోయిన్స్ తో ఆడిపాడే గీతాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ విషయం గురించి నిర్మాతలు మాట్లాడుతూ... '' ఇద్దరు ముద్దుగుమ్మలు... మధ్యలో హీరో. ఈ నారీ నారీ నడుమ నలిగిన హీరో కథలు తెలుగు తెరపై వినోదం పంచిపెట్టాయి. ప్రేమ తూకంలో ఎటు వైపు మొగ్గాలో తెలియక హీరో పడిన పాట్లు... భలే తమాషాగా ఉంటాయి. ఇప్పుడు రామ్చరణ్ కూడా ఇద్దరు హీరోయిన్స్ మధ్య చిక్కుకున్నారు..చరణ్ ఇప్పటి వరకూ చేయని కథలో కనిపించనున్నారు. ఆయన పాత్ర రెండు కోణాల్లో సాగుతుంది. హీరోయిన్స్ ఇద్దరి పాత్రలూ కీలకమే. ఈ ముగ్గురి మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు వినోదం పంచిపెడతాయి'' అని అన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా, ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తండ్రి చిరంజీవి చిత్రాలలో కూడా హీరో.. సమాజంలో జరిగే అన్యాయాలను ఎదురించి పోరాడే వాడు. అదే స్టైల్ లో రామ్ చరణ్ కూడా మెగాభిమానులను అలరించనున్నారు.
రచయిత ఆకుల శివ మాట్లాడుతూ.. ''సందేశాన్ని కూడా వినోదం మేళవించి చెప్పినప్పుడే రక్తికడుతుంది. అదీ జనాదరణ ఉన్న హీరోతో చెప్పిస్తే ఎక్కువమందికి చేరుతుంది. చిరంజీవి రక్తదానం గురించి చెప్పారు కాబట్టే అవగాహన ఏర్పడింది. కాబట్టి మనం ప్రేక్షకులకు మంచి విషయం చెప్పాలనుకొన్నప్పుడు ఓ స్టార్ ద్వారా అతని ఇమేజ్కి తగ్గ కథలో మేళవించి చెప్పాలి. ఎక్కడా వాణిజ్య విలువలు వదులుకోకూడదు. ఇప్పుడు రామ్చరణ్ చిత్రంలో అంతర్లీనంగా కొన్ని విషయాలు చెప్పబోతున్నాము''అన్నారు.
ఈ చిత్రంలో కథ... తండ్రికిచ్చిన మాట కోసం తనయుడు ఏం చేశాడనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి టెన్షన్ తోపాటు మంచి యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గని సినిమా. చిరంజీవిగారితో 'ఠాగూర్' తీసిన రోజులు గుర్తొస్తున్నాయి. తప్పకుండా అందరినీ మెప్పించే సినిమా తీస్తున్నామని దర్శకుడు వినాయక్ అన్నారు.