Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ చిత్రం వాయిదా
రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేయనున్న చిత్రం ప్రారంభం వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగబాబు చెప్పారు. మొదటి అనుకున్నట్లుగా ఈ నెల పది న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం జరగాలి. అందుకు సంభందించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే రాష్ట్రంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ తేదిని ఇరవై ఒకటికి మార్చారు. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో చిత్రాన్ని జనరంజకంగా మారుస్తామని చెప్పారు.
అలాగే బోణి చిత్రం హీరోయిన్ కృతి కర్భంద సకెండ్ హీరోయిన్ గా సెలక్టయినట్లు సమచారం. మొదటి హీరోయిన్ గా జెనిలియా చేస్తోంది. ఈ నెల ఇరవై తారీఖున ప్రారంభమయ్యే ఈ చిత్రం మొదటి షెడ్యూలు ఆస్ట్రేలియాలో జరగనుంది. అంజనా ప్రొడక్షన్స్ పై భారీగా నిర్మించనున్న ఈ చిత్రానికి హరీష్ జేరాజ్ సంగీతం అందిస్తున్నాడు. తోట ప్రసాద్ మాటల రాస్తున్నాడు. ఆనంద సాయి ఆర్ట్స్ వర్క్ చేస్తున్నారు. ఆరెంజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో రామ్ చరణ్ ప్లే బోయ్ పాత్రను చేస్తున్నట్లు సమాచారం.