Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ చరణ్ చిత్రం వాయిదా
రామ్ చరణ్, జెనీలియా కాంబినేషన్లో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేయనున్న చిత్రం ప్రారంభం వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగబాబు చెప్పారు. మొదటి అనుకున్నట్లుగా ఈ నెల పది న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం జరగాలి. అందుకు సంభందించిన ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే రాష్ట్రంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ తేదిని ఇరవై ఒకటికి మార్చారు. ఆ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో చిత్రాన్ని జనరంజకంగా మారుస్తామని చెప్పారు.
అలాగే బోణి చిత్రం హీరోయిన్ కృతి కర్భంద సకెండ్ హీరోయిన్ గా సెలక్టయినట్లు సమచారం. మొదటి హీరోయిన్ గా జెనిలియా చేస్తోంది. ఈ నెల ఇరవై తారీఖున ప్రారంభమయ్యే ఈ చిత్రం మొదటి షెడ్యూలు ఆస్ట్రేలియాలో జరగనుంది. అంజనా ప్రొడక్షన్స్ పై భారీగా నిర్మించనున్న ఈ చిత్రానికి హరీష్ జేరాజ్ సంగీతం అందిస్తున్నాడు. తోట ప్రసాద్ మాటల రాస్తున్నాడు. ఆనంద సాయి ఆర్ట్స్ వర్క్ చేస్తున్నారు. ఆరెంజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో రామ్ చరణ్ ప్లే బోయ్ పాత్రను చేస్తున్నట్లు సమాచారం.