Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ పోటా పోటీగా ఒకే రోజు...
ఎన్టీఆర్ గతంలో అదుర్స్ తో సంక్రాంతికి భాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ఉన్నారు. రామ్ చరణ్ మాత్రం ఇదే తొలిసారి. రెండు ప్రాజెక్టులపైనా ప్రేక్షకులలో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దర్శకులు శ్రీనువైట్ల, వినాయిక్ లు కూడా తమ ప్రాజెక్టులపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే రెండు సినిమాలు యాక్షన్ కామెడీలే కావటం విశేషం. అంతేగాక రెండు సినిమాల్లోనూ బ్రాహ్మానందం కీ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ సైతం 'బాద్షా' చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ, కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన బండ్ల గణేష్, దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.
రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి 'నాయక్' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ది లీడర్ అనేది ట్యాగ్ లైన్ తో రెడీ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఐస్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా, ద్వి పాత్రలతో ఉండనుంది. ఇందులో రామ్ చరణ్ క్యారక్టర్ సమాజానికి ఉపయోగపడేలా ఉంటుంది. దర్శకుడు రామ్ చరణ్ ని అన్యాయాన్ని ఎదిరించే యువకుడిగా చూపిస్తున్నారు.