Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షాక్ : భార్య సలహాపై చరణ్, రెండు వారాలు పాటు దూరంగా
హైదరాబాద్: 'డిజిటెల్ డెటాక్స్ '...... ఈ పదం చాలా కొత్తగా అనిపిస్తోంది కదూ. కంగారుపడకండి..అదేమి వింత పదం కాదు..దాని అర్దం ఏమిటంటే...సెలఫోన్స్ తో సహా ఎలక్ట్రానిక్స్, డిజిటిల్ అప్లైయిన్స్ ఏమీ లేకుండా ఉండటం. గత రెండు వారాలుగా రామ్ చరణ్, ఆయన భార్య ఈ డిజిటెల్ డెటాక్స్ పాటిస్తూ ఉన్నారు. వారు సెల్ పోన్స్ సైతం ఏ ఎలక్ట్రానిక్, డిజిటల్ వస్తువూ వాడలేదు.
ఈ ధెరపి చాలా అద్బుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. జీవితాన్ని తిరిగి మనలో కోల్పోయిన చైతన్యాన్ని నింపుతుందని అంటున్నారు. ప్రతీ సంవత్సరం ఇలా ఉపాసన తన భర్తను ఈ ధెరపీకు తీసుకు వెల్తుంది. డిజిటల్ వెకేషన్ పాటిస్తుంది. ఈ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా కమ్యునికేట్ కూడా చేయకూడదు. అయితే చాలా కష్టం ఈ రోజుల్లో ఎవరికైనా.
ముఖ్యంగా రామ్ చరణ్ వంటి సెలబ్రెటికు మరీను. ఆయన షూటింగ్ షెడ్యూల్స్, కమిట్ మెంట్స్ మధ్యన ఇలా డిజిటిల్ డెటాక్స్ అంటూ ఎలక్ట్రానిక్ గూడ్స్ కు దూరంగా గడపటం గొప్ప విషయమే. అయితే ఇది ఉపాసన కోరిక, దాంతో రామ్ చరణ్ తన భార్య మాటకు విలువ ఇచ్చి ఇలా ముందుకు వెళ్లాడు.
ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం 'ధృవ' కోసం చాలా శ్రమిస్తున్నారు. ఇందుకోసం రెండు నెలల సమయం తీసుకుని 10 కేజీల బరువు తగ్గారు. బరువు తగ్గిన చరణ్ని చూస్తూ చాలా మంది ఆశ్చర్యపోయారు.'ధృవ' చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం టీమ్ అంతా కాశ్మీర్ కు వెళ్తున్నారు. అక్కడ రామ్ చరణ్, రకుల్ ప్రీతి సింగ్ ల మీద సీన్స్ చిత్రీకరిస్తారు. అలాగే తెలుగు నేటివిటీ కోసం చిత్రం కథలో పూర్తి మార్పులు చేసినట్లు తెలుస్తోంది.తమిళం కన్నా తెలుగులో మరింత స్టైలిష్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని సురేంద్రరెడ్డి బావిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్'కి ఇది రీమేక్. ఇందులో రామ్చరణ్ అథ్లెటిక్ దేహంతో కనిపించనున్నారు.