Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
10 సంవత్సరాల క్రితమే ఓకే అన్నారు..! పవన్ కళ్యాణ్ సీక్రెట్ చెప్పేసిన రామ్ చరణ్
చిరంజీవి హీరోగా తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ ఆధారంగా రాబోతున్న చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంచలనాలకు నాంది పలికేలా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంఛ్లో భాగంగా మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ సమాధానమిచ్చారు. ఆ వివరాలు చూస్తే..
పవన్ కళ్యాణ్ వాయిస్..
పవన్ కళ్యాణ్ వాయిస్ ట్రైలర్ వరకే పరిమితమా? లేక సినిమాలో కూడా ఉంటుందా? అని ఓ మీడియా ప్రతినిథి వేసిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు రామ్ చరణ్. వెంటనే డైరెక్టర్ సురేందర్ రెడ్డి వైపు ఓ లుక్కేసి.. సీక్రెట్ చెప్పేశారు. పవన్ కళ్యాణ్ వాయిస్ సినిమాలో కూడా ఉంటుందని చెప్పేశారు చెర్రీ.
10 సంవత్సరాల క్రితమే చిరు ఓకే చేశారు
కనుమరుగైపోయిన ఓ చరిత్ర కారుడి చరిత్రను 'సైరా నరసింహా రెడ్డి' రూపంలో ఇప్పుడు ఫ్యాన్ ఇండియా మూవీగా తీసుకురావడానికి కారణాలేంటి? అనే దానిపై స్పందిస్తూ.. 10 సంవత్సరాల క్రితమే నాన్నగారు ఓకే చేసిన సబ్జెట్ ఇది. దాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి సరైన టైంలో, సరైన బడ్జెట్ తో అందరి ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పారు.
తమన్నా, నయనతార టాలెంట్ చూపారు
ఇక సైరా ట్రైలర్ విషయానికొస్తే.. ఇందులో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు కేక పెట్టించేలా ఉన్నాయి. తమన్నా గ్లామర్, నయనతార ఫెర్ఫార్మెన్స్ ట్రైలర్లో హైలెట్గా నిలిచాయి. విలన్గా సుదీప్ హావభావాలు, విజయ్ సేతుపతి ఫెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా కనిపించాయి.
వరల్డ్వైడ్గా భారీ రెస్పాన్స్
మరోవైపు 'సైరా నరసింహా రెడ్డి' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రి రిలీజ్ వరల్డ్ వైడ్గా రూ.190 కోట్లకుపైగా జరిగినట్టు తెలిసింది. ఓ తెలుగు సినిమా విషయానికి వస్తే.. ఇదే అత్యుత్తమ రికార్డ్ అని చెప్పుకొంటున్నారు.
అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ వేడుక
సైరా నరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం చేశారు. అంగరంగ వైభవంగా హైదరాబాద్లో ఈ వేడుక నిర్వహించనున్నారు. నిజానికి ముందుగా ఈ వేడుకను సెప్టెంబర్ 18 నే నిర్వహించాలని అనుకున్నప్పటికీ చివరి క్షణంలో దాన్ని వాయిదా వేసి సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నామని ప్రకటించారు.
సైరా మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.