Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆశ్చర్యం: చిరు, చరణ్ గురించి కృష్ణవంశీ స్పీచ్ (ఫోటోస్)
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా దర్శకుడు కృష్ణవంశీ 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరింగింది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ చిరంజీవి, రామ్ చరణ్ గురించి చెప్పిన పలు విషయాలు ఆశ్చర్యానికి గురిచేసాయి.
చిరంజీవి గురించి మాట్లాడుతూ...చిరంజీవితో ఓ యాడ్ షూట్ చేసినప్పుడు, నాకు ఆయన వాడిన ల్యాండ్ క్రూజర్ కార్ బాగా నచ్చింది. ఆ విషయాన్ని ఆయనతో అన్నాను. ఓ రోజు ఆయన నాకు ఫోన్ చేసి రమ్మని ఆ కారుని బహుమతిగా ఇచ్చారు. నేనది ఊహించలేదు'' అని కృష్ణవంశీ చెప్పారు.
రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ....గత మూడు, నాలుగేళ్లుగా కెరీర్ పరంగా కొంచెం డౌన్ లో ఉన్నాను. రామ్ చరణ్ ను కలిసినపుడు నాకు చాలా మర్యాద ఇచ్చాడు. నేనెంతోమంది ఆర్టిస్టులకు అవకాశం ఇచ్చాను కానీ, నాకెవరూ అవకాశం ఇవ్వలేదు. నాకు అవకాశం ఇచ్చిన ఆర్టిస్ట్ రామ్ చరణ్. తను సంస్కారవంతుడని తెలిపారు.
స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..
స్టో్రీ లైన్ ఇదే...
లండన్ లో ఉండే ఓ యువకుడు ఆంధ్ర ప్రదేశ్ లోని ఓ గ్రామంలో తన మూలాలను వెతికే కథాంశంతో సినిమా సాగుతుందని తెలిపారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ
మగధీర'వంటి శక్తిమంతమైన చిత్రం చేసిన తర్వాత ఓ సున్నితమైన సినిమా చేయాలనుకున్నాను. అప్పుడే కృష్ణవంశీని కలిశాను. నాతో సినిమా చేయమని కోరాను. కుటుంబ కథా చిత్రం చేయాలనుకున్నాను. అది కూడా కృష్ణవంశీతోనే చేయాలనుకున్నాను. అది నెరవేరింది. ఈ చిత్రవిజయంపై నాకు పూర్తి నమ్మకం ఉంది'' అన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ
కృష్ణవంశీతో కొంత విరామం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మానవీయ విలువల నేపథ్యంలో సాగే కథ ఇది. తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలో తెలియజేసే సినిమా. ఈ సినిమాలో చరణ్ ని కొత్త కోణంలో చూపిస్తున్నాడు కృఫ్ణవంశీ'' అని తెలిపారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ
ఈ చిత్రం విడుదల తర్వాత తెలుగు పరిశ్రమ కృష్ణవంశీని చూసి గర్వపడుతుందన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం ఆకట్టుకుంటుందని తెలిపారు.
సినిమా విడుదల
గోవిందుడు అందరి వాడేలే చిత్రం దాసరా కానుకగా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.